93కు చేరిన బెలుచిస్తాన్‌ భూకంప మృతులు

ఇస్లామాబాద్‌ : నైరుతి పాకిస్తాన్‌ బెలుచిస్తాన్‌లోని పలు జిల్లాల్లో మంగళవారం భూకంపం సంభవించిన సంగతి తెలిసిందే. రిక్టర్‌ స్కేలుపై తీవ్రత 7.7గా నమోదైంది. భూకంపం దాటికి మృతి చెందిన వారి సంఖ్య 93కు చేరింది.200 మందికి పైగా గాయపడ్డారు.శిథిలాల కింద ఇంకా కొందరూ చిక్కుకుని ఉన్నారు.వందల ఇళ్లు ,భవనాలు ,దుకాణాలు, కూలిపోయాయి. భద్రతా దళాలు ,వైద్య సిబ్బంది సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.