99 ఏళ్ళ వృద్దుడి కిరాత‌కం

చెన్నై(జ‌నం సాక్షి) : తాత వయసు.. చిన్న పిల్లలను ఆడిపాడించాల్సిన బాధ్యత.. పిల్లలకు మంచి చెడుల గురించి విడమరిచి చెప్పాల్సిన పెద్దాయన.. ఎవరూ ఊహించని విధంగా.. దుర్మార్గపు పని చేసి.. ఏం పెద్ద మనిషయ్య అని ఛీ కొట్టించుకున్నాడు 99 ఏళ్ల వృద్ధుడు. చెన్నైకి చెందిన కె. పరశురామన్(99) ప్రభుత్వ పాఠశాలలో ప్రిన్సిపాల్‌గా పని చేసి గత కొన్నేళ్ల క్రితం పదవీ విరమణ పొందారు. ఈ క్రమంలో ఇంట్లో ఉంటూ కాలక్షేపం చేస్తున్నాడు. ఈయనకు ఏడుగురు సంతానం. ఐదు ఇండ్లు కట్టించుకున్నాడు. అయితే ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్న కుటుంబంలోని చిన్నారిని పరశురామన్ అత్యాచారం చేశాడు. బాధితురాలికి కడుపు నొప్పి రావడంతో జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. అంతే కాకుండా అసహజంగా తనతో ప్రవర్తించడాని బాధిత బాలిక బోరున విలపించింది. దీంతో ఆ చిన్నారి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తులో భాగంగా నిందితుడిని అరెస్టు చేశారు. పరశురామన్‌కు ఐదుగురు కూతుళ్లు, ఇద్దరు కుమారులతో పాటు పదుల సంఖ్యలో మనవళ్లు, ముని మనవళ్లు ఉన్నారు. వీరంతా తమిళనాడు చుట్టుపక్కల ప్రాంతాల్లో సెటిలయ్యారు.