త్వరలో బంగ్లాదేశ్లో ఎన్నికలు
` మహమ్మద్ యూనస్
ఢాకా(జనంసాక్షి): రాజకీయ అనిశ్చితిలో ఉన్న బంగ్లాదేశ్లో మరోసారి నిరసనలు కొనసాగుతున్నాయి. ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్లు వెల్లువెత్తున్నాయి.
వీటిపై ఆ దేశ తాత్కాలిక సారథి మహమ్మద్ యూనస్ తాజాగా మాట్లాడారు. తమ దేశంలో ఎన్నికలు ఈ ఏడాది డిసెంబర్- 2026 జూన్ మధ్య జరగొచ్చని చెప్పారు. కొన్ని సంస్కరణలు చేపడుతున్నామని, అవి పూర్తయిన తర్వాత ఎన్నికల షెడ్యూల్ ప్రకటిస్తామన్నారు. జపాన్ రాజధాని టోక్యోలో జరిగిన ఓ ర్యాలీలో ఆయన మాట్లాడుతూ ఈ ప్రకటన చేశారు.గత ఏడాది రిజర్వేషన్లపై విద్యార్థులు చేపట్టిన ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో వందల మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. దాంతో ఆ సమయంలో ప్రధానిగా ఉన్న షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేయాల్సివచ్చింది. ఆందోళనలు తీవ్రరూపం దాల్చడంతో ఆమె దేశం విడిచి, భారత్కు వచ్చి ఆశ్రయం పొందుతున్నారు. ఆమె రాజీనామాతో బంగ్లాలో అవామీ లీగ్ ప్రభుత్వం పడిపోయింది. ప్రస్తుతం మహమ్మద్ యూనస్ సారథ్యంలో తాత్కాలిక ప్రభుత్వం కొనసాగుతోంది.