గాజాలో మిన్నంటిన ఆకలికేకలు
` ఆకలితో గోదాములపై ప్రజల దాడులు
` తీవ్ర ఆహార సంక్షోభం..
గాజాస్ట్రిప్(జనంసాక్షి):ఇజ్రాయెల్- హమాస్ల మధ్య పోరు తీవ్రతరమైంది. ఈ పోరులో గాజాలో అనేకమంది సాధారణ ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు.మరోవైపు ఆ ప్రాంతంలో ఆకలి సంక్షోభం నెలకొంది. అన్నపానీయాలతో పాటు ఇతర అత్యవసర సామగ్రి సరిగా అందక ప్రజలు అల్లాడుతున్నారు. ఈక్రమంలో ఆకలి తీర్చుకునేందుకు అంతర్జాతీయ సంస్థలు ఏర్పాటుచేసిన గిడ్డంగుల పైనే ఏకంగా దాడులకు పాల్పడుతున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్గా మారాయి. గాజా ప్రజలకు అందించే మానవతా సాయం తరలింపునకు టెల్అవీవ్ పరిమితంగానే అనుమతించిన సంగతి తెలిసిందే. ఈక్రమంలోనే డీర్ అల్ బలాప్ాలోని ఆహార పదార్థాల గిడ్డంగిపై ప్రజలు దాడి చేశారని గిడ్డంగి అధికారులు తెలిపారు. గోధుమపిండి, ఇతర ఆహార పదార్థాలు కలిగిఉన్న పెట్టెలను లూటీ చేసినట్లు వెల్లడిరచారు. గాజాలో మానవతా అవసరాలు అదుపుతప్పాయని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రజలకు అందే సాయాన్ని తక్షణమే పెంచాల్సిన అవసరం ఉందన్నారు. ఈ గందరగోళం నేపథ్యంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా.. పలువురు గాయపడినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి నెట్టింట వైరల్ అవుతున్న వీడియోలో గన్ పేలుడు శబ్దాలు కూడా వినిపిస్తున్నాయి.ఐక్యరాజ్యసమితితో పాటు అంతర్జాతీయ సంస్థలకు చెందిన 121 ట్రక్కుల మానవతా సాయం బుధవారం గాజాలోకి ప్రవేశించాయని ఇజ్రాయెల్ అధికారులు తెలిపారు. అయితే, ఇది అక్కడి ప్రజల అవసరానికి అందుబాటులో లేదని ఐరాస అధికారులు పేర్కొంటున్నారు. ఈ సాయం మరింత పెరగాలని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఐరాస మానవతా కార్యాలయం అధికారి జొనాథన్ విఠల్ మాట్లాడుతూ.. గాజాకు అందించే సాయాన్ని హమాస్ మళ్లిస్తోందనే ఆరోపణలను ఖండిరచారు. ఇజ్రాయెల్లోని కెరెమ్ షాలోమ్ సరిహద్దులు దాటే సమయంలో ఒక క్రిమినల్ గ్యాంగ్ ఈ సాయాన్ని లూటీ చేస్తోందని ఆరోపించారు. ఈసందర్భంగా గాజాకు అందే మానవతా సాయం పెంచాల్సిన అవసరం ఉందన్నారు. 2023 అక్టోబర్ నుంచి ఇజ్రాయెల్- హమాస్ల మధ్య జరుగుతోన్న పోరులో 54 వేల మంది ప్రాణాలు కోల్పోయారని స్థానిక యంత్రాంగం వెల్లడిరచింది. మానవతా సాయాన్ని పరిమితంగా అందించేందుకు ఇజ్రాయెల్ అనుమతిచ్చింది. అయితే, ఇది అక్కడి ప్రజలకు ఏమాత్రం సరిపోదనే ఆందోళన వ్యక్తమవుతోంది. కాగా.. గాజాలో మానవతా సాయాన్ని ఇప్పటివరకు ఐరాస సంస్థలు, ఇతర స్వచ్ఛందసంస్థలు పర్యవేక్షించేవి. అయితే ఆ సాయం హమాస్కు చేరుతోందని, దాన్ని తప్పించేందుకు గాజా హ్యుమానిటేరియన్ ఫౌండేషన్ను ఇజ్రాయెల్ ఏర్పాటుచేసింది. ప్రస్తుతం సాయం ఈ ఫౌండేషన్ ద్వారా అందుతోంది. అయితే దీన్ని ఐరాస, ఇతర స్వచ్ఛంద సంస్థలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.