ఇందిరమ్మ ఇల్లు రాలేదని వ్యక్తి ఆత్మహత్య

యాచారం, మే 30(జనం సాక్షి):ఇందిరమ్మ ఇల్లు రాలేదని తీవ్ర మనస్థాపానికి గురైన ఓ వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన యాచారం పోలీస్ స్టేషన్ పరిధిలోని చింతపట్ల గ్రామంలో శుక్రవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. సిఐ నందీశ్వర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం చింతపట్ల గ్రామానికి చెందిన దొడ్డి అశోక్ (44) అనే వ్యక్తి, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన ఇందిరమ్మ ఇళ్లకు దరఖాస్తు చేసుకున్నాడు. అతనికి సొంతిల్లు లేకపోవడంతో ఇందిరమ్మ లిస్టులో అతని పేరు సైతం వచ్చింది. కానీ చివరిలో తన పేరు లిస్టులో లేకపోవడంతో అతను తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. గ్రామంలో ఇల్లు మంజూరైన వారందరూ ఇండ్ల నిర్మాణానికి ముగ్గు పోసుకొంటున్నారు. కానీ అశోక్ పేరు లేకపోవడంతో అతను ఆవేదన చెందాడు. ఇంట్లో తెల్లవారుజామున ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. నా చావుకు కారణం ఇందిరమ్మ ఇల్లు రాకుండా చేసిన కాంగ్రెస్ నాయకులు అని తన చేతిపై రాసుకొని ఆత్మ హత్య చేసుకున్నాడు. అతనికి భార్య, ముగ్గురు ఆడ పిల్లలు ఉన్నారు.
మృతుడి కుటుంబానికి 120 గజాల ఇంటి స్థలం ఇందిరమ్మ ఇల్లు
యాచారం తహసిల్దార్ అయ్యప్పమృతుడి కుంటుంబనికి 120గజాల స్థలం, ఇందిరమ్మ ఇల్లు మాంజూరు చేస్తామని ఏసీపీ రాజు, తహసీల్దార్ అయ్యప్ప హామీతో మృతదేహాన్ని గ్రామపంచాయితీ నుండి పోస్ట్ మార్టం కొరకు ఆసుపత్రికి తరలించారు.

తాజావార్తలు