జూన్ 4న ఇందిరా పార్క్ వద్ద ధర్నాకు సన్నాహాలు
కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు జ్యుడీషియల్ కమిషన్ నోటీసులు జారీ చేయడంపై ఆ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్రంగా స్పందించారు. కమిషన్ చర్యను ఖండిస్తూ ఆమె నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చారు.తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కూడా అయిన కవిత, జూన్ 4వ తేదీన హైదరాబాద్ నగరంలోని ఇందిరా పార్క్ వద్ద ఈ నిరసన చేపట్టనున్నట్లు వెల్లడించారు. కేసీఆర్కు కమిషన్ నోటీసులు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ, తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఈ ధర్నా కార్యక్రమం జరుగుతుందని ఆమె తెలిపారు.ఇదిలా ఉండగా, ఈరోజు సాయంత్రం నగరంలోని బంజారాహిల్స్లో తెలంగాణ జాగృతి సంస్థ నూతన కార్యాలయాన్ని కూడా ఎమ్మెల్సీ కవిత ప్రారంభించనున్నారు.