బంగారు రుణాలపై ఆర్బీఐ కొత్త నిబంధనల ప్రతిపాదన
బంగారంపై రుణాలు తీసుకునే చిన్న మొత్తాల రుణగ్రహీతలకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఊరట లభించే అవకాశం కనిపిస్తోంది. ఈ రుణాలకు సంబంధించి ఆర్బీఐ ప్రతిపాదించిన కొన్ని కఠినమైన మార్గదర్శకాల విషయంలో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ జోక్యం చేసుకుంది. ప్రత్యేకించి, రూ.2 లక్షల వరకు బంగారం తాకట్టు పెట్టి రుణాలు తీసుకునే వారికి ఈ కొత్త నిబంధనల నుంచి మినహాయింపు ఇవ్వాలని ఆర్బీఐకి సూచించింది. త అయితే, ఈ నిబంధన వల్ల చిన్న, సన్నకారు రైతులు, ఇతర అల్పాదాయ వర్గాల వారు తక్షణ ఆర్థిక అవసరాలకు రుణాలు పొందడం కష్టతరం అవుతుందని తమిళనాడులోని పలు రాజకీయ పార్టీలు, రైతు సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ మార్గదర్శకాల విషయంలో పునరాలోచన చేయాలని కోరుతూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు స్వయంగా లేఖ రాశారు.ఈ పరిణామాల నేపథ్యంలో, ఆర్బీఐ జారీ చేసిన ముసాయిదా మార్గదర్శకాలను కేంద్ర ప్రభుత్వంలోని ఆర్థిక సేవల విభాగం (డీఎఫ్ఎస్) క్షుణ్ణంగా పరిశీలించింది. ఇందులో భాగంగానే, రూ.2 లక్షల వరకు రుణాలు తీసుకునే వారికి ఈ 75 శాతం పరిమితి నిబంధన నుంచి మినహాయింపు కల్పించాలని ఆర్బీఐకి స్పష్టం చేసింది. అంతేకాకుండా, ఈ కొత్త మార్గదర్శకాలను క్షేత్రస్థాయిలో అమలు చేయడానికి తగినంత సమయం అవసరమని భావించిన ఆర్థిక శాఖ, వీటిని 2026 జనవరి 1వ తేదీ నుంచి అమల్లోకి తీసుకురావాలని కూడా ఆర్బీఐకి సూచించింది.