అక్బరుద్దీన్‌పై కేసు నమోదుకు నాంపల్లి కోర్టు ఆదేశం

హైదరాబాద్‌: ప్రజలను రెచ్చగొట్టేలా వివాదాస్పద వ్యాఖ్యాలు చేసిన ఎంఐఎం నేత అక్బరుద్దీన్‌పై కేసు నమోదు చేయాలని ఓయూ పోలీసులను నాంపల్లి కోర్టు ఆదేశించింది. వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ ఎమ్మెల్యేపై వెంకటేశ్‌గౌడ్‌ అనే వ్యక్తి వేసిన పిటిషన్‌పై కోర్టు స్పందించింది.