అస్సోం బాధితులను ఆదుకునే నాథుడే లేడు-ఇటలీ అమ్మ బోమ్మలా నిలబడింది

కరీంనగర్‌:(టౌన్‌) అస్పోం బాధితులను ఆదుకోవాలని బీజేపీ విశ్వహిందూ పరిషత్‌ కలెక్టరెట్‌ ముందు ఈ రోజు ధర్నా చేశారు. అస్సోం బాధితులను ఆదుకునే నాథుడే లేడని యూపీఏ చైర్‌పర్సన్‌ (సోనియాగాంధి) ఇటలీ అమ్మ, బోమ్మలా నిలబడిందని ఎద్దేవ చేశారు. అస్సోం బిధితులను ఆదుకొవాలని, బంగ్లాదేశ్‌ శరనార్థులను వెంటనే పంపివేయాలని స్థానిక అస్సోం మైనార్టీలను రాష్ట్రం, కేంద్ర ప్రభుత్వాలు ఆదుకొవాలని దేశంలోని వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు ఆయా రాష్ట్రలలో వలస అస్సోం ప్రజలను ఆదుకుని వారి వారి ప్రాంతాలకు వెళ్లే సౌకర్యం ఏర్పాటు చేయాలని, వారి ఉపాధికి సంబందించి కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్‌ చేస్తూ జిల్లా కలెక్టర్‌కు బీజేపీ జిల్లా అధ్యక్షుడు మీస అర్జున్‌రావు, విశ్వహిందూ పరిషత్‌ జిల్లా అధ్యక్షుడు బూస శ్రీనివాస్‌, యువమోర్చ జిల్లా అధ్యక్షుడు రమణరెడ్డ, అడ్వకేట్‌ అంజనేయులు, ఏబీవీపీ కార్యకర్తలు వినతి పత్రం ఇచ్చారు.