ఇద్దరూ దోచింది తెలంగాణనే !

నవంబర్‌ నెలకు తెలంగాణకు అవినాభావ సంబంధం ఉన్న ట్టుంది. తెలంగాణను ఆంధ్రప్రదే శ్‌లో కలిపింది నవంబర్‌ ఒకటి అయితే, ఆంధ్ర ప్రదేశ్‌ నుంచి తెలంగాణ విముక్తికి స్ఫూర్తిగా నిలి చింది కూడా నవంబర్‌ నెలనే. ఇటువంటి శీతాకాలంలోనే కేసీఆర్‌ తెలంగాణ కోసం తన ఆఖరి అస్త్రమైన నిరాహారదీక్షను ఉపయోగిం చారు. తెలంగాణ ఉద్యోగుల న్యాయమైన డిమాండు ఢిల్లీ వీధుల్లో నగుబాటుకు గురైన పరిస్థితుల్లో ఇక తెలంగాణ కోసం అమీతుమీ తేల్చుకోక తప్పదని గుర్తించి ఆయన నవంబర్‌ 29న ఆమరణ దీక్షకు దిగారు. అప్పటికి దశాబ్దాలుగా తెలంగాణ రాష్ట్రం కోసం క లలు కంటున్న వాళ్లు, తపిస్తున్న వాళ్లు అనేక మందే ఉండి ఉండవచ్చు. కానీ తెలంగాణను సక ల జనుల స్వప్నంగా మలచింది మాత్రం నవంబర్‌ 2009. ఇప్పుడు ఈ నవంబర్‌ పార్లమెంటు శీతా కాల సమావేశాల్లో అనూహ్యంగా తెలంగాణ డిమాండుకు ఉత్తరాది పార్టీల నుంచి విశేషమైన మ ద్దతు లభిస్తోంది. మాయావతి విసిరిన చిన్న రాష్ట్రాల వలలో చిక్కుకుని ఇప్పుడు పార్లమెంటులోని పెద్ద పార్టీలన్నీ విలవిలలాడుతున్నాయి. ఈసారి పార్లమెంటు చర్చల్లో తెలంగాణ ఒక ప్రధానమైన అంశంగా మారిపోయింది. రెండేళ్ల క్రితం కేసీఆర్‌ దీక్ష ప్రజలనే కాదు, రాష్ట్ర రాజకీయాల దశ ది శ పూర్తిగా మార్చేసింది. రాజకీయ పార్టీలు మొదలు చట్టసభల మీద విశ్వాసంలేని పార్టీలు, ఉద్యమాలు కూడా కేసీఆర్‌ నిర్దేశించిన ఏజెండాను ఎత్తుకున్నాయి. తెలంగాణలో మూడు దశాబ్దాల విముక్తి ఉద్యమాలకు, సామాజిక సాంస్కృతిక పోరాటాలకు సారథులుగా ఉన్న గద్దర్‌, విమలక్కతోపా టు మందకృష్ణ వంటి వారు కూడా ఏదో ఒక దశ లో కేసీఆర్‌ను బలపరిచిన వారే ఇప్పుడు వారు ఆయన మార్గంతో విభేదించవచ్చు.

కానీ అందరి గమ్యం ఒక్కటే అనడంలో సందేహాలు ఉండక్కర్లేదు. ఇవన్నీ కలిసే గడిచిన రెండేళ్లలో ఈ రాష్ట్రంలో తెలంగాణ తప్ప మరో వార్త లేని పరిస్థితి నెలకొంది. కానీ ఢిల్లీ పరిణామాలు ఎలా ఉన్నా తెలంగాణలో మాత్రం పరిస్థితి అంత ఆశావహంగాలేదు. ఉద్యమాల్లో పాల్గొన్న చాలా మంది ఇప్పటి పరిస్థితుల పట్ల కలవరపడుతున్నారు. రాజకీయ క్రీనీడలో మరోసారి తెలంగాణ తెర మరుగౌతుందా అన్న ఆందోళన వ్యక్తమౌతోంది. తెలంగాణ వచ్చే దాకా తెగించి పోరాడుదాం అన్న రాజకీయ నాయకులు డమ్మీ రాజీనామాలతో సహా తమ అమ్ములపొదిలోని అన్ని ఆస్త్రాలు చకచకా వాడేసి ఇప్పుడు చేతులెత్తి నిలబడ్డారు. ఇదే అదునుగా చంద్రబాబు రెండేళ్ల విరామం తరువా త తెలంగాణలో కాలుమోపి పునీతుడైపోయాడు. రేపో మాపో జగన్‌ మానుకోట కాకపోతే మరోబా ట గుండా తెలంగాణలో ప్రవేశించి ఓదార్పు పొం దుతాడు. ఇంకోవైపు తెలంగాణ తెచ్చేదీ ఇచ్చేదీ మేమే అన్న కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు కొత్తకొత్త కార్లలో ఇప్పుడు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి కాన్వా య్‌గా కదులుతున్నారు. అధిష్ఠానాన్ని ఒప్పించి తెలంగాణ తెస్తామన్న మంత్రులు ముఖ్యమంత్రి గారికి రక్షణ కవచమై రచ్చబండలో రేషన్‌ కార్డులు ఇప్పిస్తున్నారు. సందట్లో సడేమియాలుగా కొందరు విశాలాంధ్రవాదులు తెలంగాణ సంఘాల సహకారంతో జిల్లాలు తిరిగి సమైక్య స్వస్థత కూట ములు నిర్వహించే సన్నాహాల్లో ఉన్నారు. చారిత్రాత్మకమైన సకల జనుల సమ్మె ముగిసిన వెనుక చోటుచేసుకున్న ఈ పరిణామాలన్నీ చాలా మందినే కలవర పెడుతున్నాయి.

అంతకంటే కలవరపెట్టే వాస్తవాలను ఇప్పుడు సీబీఐ అవిష్కరి స్తోంది. హైకోర్టు ఆదేశాల మేర కు జగన్మోహన్‌ రెడ్డి, చంద్రబాబుల ఆస్తుల వివరాలు సేకరిస్తోన్న సీబీఐ ఇప్పుడు ఈ ఇద్దరు నేతలు ఎంత దోచుకున్నది లెక్కగట్టబోతోంది. ఇది రెండు పిల్లుల కథను గుర్తుకు తెస్తోంది. రెండు పిల్లులు, ఒక ముసలమ్మ ఇంట్లో దూరి ఆ ముసలమ్మ చేసి పెట్టుకున్న రొట్టె ముక్కను ఎత్తుకుపోతాయి. ఈ క థ, కథలోని నీతి అందరికీ తెలిసిందే. ఆ కథ మొదట్లో ఎవరు రాశారో ఎవరు చెప్పారో గానీ కొట్లా డుకోకుండా దోచుకున్న సొత్తు ను సమానంగా పంచుకోవాలన్నది ఈ కథలోని నీతి. ఆ నీతి సూత్రాన్ని అవినీతి పరులు చాలాకాలమే పాటిస్తూ వచ్చారు. న్యాయమని నమ్మించారు. తరతరాలుగా ఆ కథ చెప్తున్న, వింటున్న వాళ్లు పాపం పిల్లులు అనుకున్నారు. కానీ రొట్టె చేసుకున్న ముసల్ది ఏమై పోయిందో ఆలోచించలేదు. ఇవాళ మన తెలుగు మీ డియా కూడా అదే ధర్మమని భావిస్తున్నట్టుంది. కొద్దికాలంగా మన మీడి యాలో ఆస్తుల గొడవ నడుస్తోంది. ముఖ్యంగా జగన్‌ ఆస్తులమీద సీబీఐ విచారణ మొదలైనప్పటి నుంచి మన ఛానళ్లు పత్రికలూ ఆయన ఆస్తుల చిట్టా సేకరించే పనిలో ఉన్నాయి. వైఎస్‌ రాజశేఖర రెడ్డి లాగా మిత్రలాభం గురించి ఆలోచించి ఉంటే పరిస్థితులు వేరుగా ఉండేవేమో కానీ ఆయన కొంచెం ఆధునికుడు, ముల్లును ముల్లుతోనే తీయాలనుకుని ఇప్పుడు చంద్రబాబును కూడా సీబీఐ ఉచ్చులోకి దించాడు. సీబీఐ విచారణ సంగతేమో గానీ మీడియాకు మాత్రం ఇప్పుడు చేతినిండా పని దొరికింది. ఇరవై నాలుగు గంట లూ తెలుగు ఛానళ్లు విడతల వారీగా జగన్మోహనరెడ్డి, చంద్రబాబుల ఆస్తుల గురించి చర్చలు, వాదోపవాదాల చేస్తోన్నాయి.

అసలు ఈ సొమ్మంతా ఎవరిది, ఇన్ని లక్షలు ఎక్కడి నుంచి సృష్టించారు అన్న విషయాల మీదికి చర్చ వెళ్ళకుండా మీడియా ఇప్పుడు పిల్లుల గురిం చి, పిల్లులకు వాటాలిచ్చిన కోతుల గురించి కథ లు కథలుగా కథనాలను ప్రసారం చేస్తున్నది. సీబీ ఐ, విచారణలు, కోర్టుల తీర్పులు ఎలా ఉన్నా ఈ రెండు కేసుల్లో ఇప్పటికే నష్టం జరిగింది మాత్రం తెలంగాణకు వీళ్లు అమ్ముకున్నా రనో, పంచి పెట్టారనో లేదా కేటాయించారనో చెపుతున్న భూముల న్నీ తెలంగాణ ప్రాంతలోనివి. అందునా ఎక్కువ హైదరాబాద్‌ చూట్టూ ఉన్నవి. రాజశేఖర్‌రెడ్డి చం ద్రబాబు వేరు వేరు వ్యక్తులు కావొచ్చు, వేరు వేరు పార్టీల్లో ఉండవచ్చు. వేరు వేరు జెండాలతో ఎన్ని కల్లో పోటీ పడి ఉండవచ్చు. కానీ ఇద్దరి ఎజెండా ఒకటే అన్నది మాత్రం ఇప్పుడిప్పుడే సీబీఐ వెలికి తీస్తున్న వివరాలను బట్టి తెలుస్తున్నది. ఇద్దరూ హైదరాబాద్‌ను, దాని చుట్టూ పక్కల ఉన్న భూములను ఆధారంగా చేసుకుని తమ తమ అభివృద్ధి ప్రణాళికల ను అమలు చేశారు. రెండు పిల్లుల కథ లో ఒక పిల్లి దోచుకొస్తే ఇంకొక పిల్లి కాపలా ఉం టుంది. బాబు అధికారంలోకి ఉన్నప్పుడు ఐదేళ్ల పాటు వైఎస్‌ ప్రధాన కాపలాదారుగా ఉండాల్సిన ప్రతిపక్ష నాయకుడు. ఆ తరువాత వైఎస్‌ అధికారంలోకి వచ్చాక ఐదేళ్లపాటు బాబు కాపలా దారు. ఏవో క్షణికావేశంలో అప్పుడప్పుడు విమర్శిం చుకునే వారు తప్ప కోర్టులు కేసుల జోలికి వెళ్లలేదే ప్పుడు. కేసులు వేసుకున్నా అవి విచారణ దాక వె ళ్లేలోపే రాద్ధాంతం లేకుండా రాజీ పడిపోయారు. వైఎస్‌ హఠాన్మరణం తరువాత జగన్‌ అతని వార సునిగా అవతరించడం చంద్రబాబు రాజకీయ ప్రస్థానానికి ఊహిం చని అడ్డంకిగా మారింది.

ఈ దశలో తెలుగుదేశం ఔత్సాహికులు కొందరు వైఎస్‌ అక్ర మాలు, జగన్‌ ఆస్తుల మీద కేసు వేసి ఇరుకున పెట్టాలని భావించి ఉంటారు. అదే కోణం చూపిస్తూ ఎర్రన్నాయుడు హైకోర్టులో కేసు వేశారు. హైకోర్టు ఆ కేసును సీబీఐకి అప్పగించడంతో అప్పటికి కాంగ్రెస్‌ ఎదురుదాడిలో గాయపడి ఉన్న జగన్‌కు పుండు మీద కారం చల్లినట్టయింది. దీంతో అక్రమ ఆస్తుల కేసులో విచారణను ఎదుర్కొంటున్న జగన్‌ తల్లి విజయమ్మ చంద్ర బాబు ఆస్తుల మీద విచారణకు కోర్టును ఆశ్రయించారు. ఆమె కేవలం పిటిషన్‌ మాత్ర మే కాక దానితో పాటు వేలాది పేజీల ఆధారాల పత్రాలు కూడా కోర్టుకు సమర్పించారు. ఇట్లా కాలం నడిచినంత కాలం ఒకరికొక రుగా ఉన్న రెండు కుటుంబాలు ఇవాళ సీబీఐ విచారణలో ఉన్నారు.

రాజశేఖర్‌రెడ్డి, చంద్రబాబు ఒకేసారి రాజకీ యాల్లోకి వచ్చారు. కానీ చంద్రబాబు మాత్రం ముందుగా అధికారంలోకి వచ్చారు. ప్రపంచంలో ఐటీకి ఆదరణ ఉన్న రోజుల్లో అధికారంలోకి వచ్చి న చంద్రబాబు హైదరాబాద్‌ రూపురేఖలను మార్చేసే పనికి పూనుకు న్నాడు. ప్రపంచబ్యాంకు మద్ద తుతో అభివృద్ధి నిర్వచనాన్ని మార్చేసి హైదరాబాద్‌ అభివృద్ధే ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి అని, హైదరాబాద్‌ను ఐటీ రాజధాని చేస్తానని వేలాది ఎకరాలు ప్రభుత్వ భూములను, పేద రైతుల భూములను బడా పెట్టుబడిదారులకు కట్టబెట్టారు. హైటెక్‌ సిటి నిర్మాణానికి దేశంలోని బడా కాంట్రాక్టర్లతో బేరసా రాలు కుదిర్చారు. సత్యం రామలింగరాజుతో స్నేహం చేశారు. ఆ స్నేహంతో అమెరికా అధినేతనే అతిథిగా పిలుచుకోగలిగారు. ఒక్క హైటెక్‌ సిటితో ఆగకుండా ఫార్మా సిటీలు మొదలు ఫిలింసిటీల దాకా వేలాది ఎకరాల తెలంగాణ భూములను ధారాదత్తం చేశారు. అంతేకాదు హైదరాబాద్‌ రంగారెడ్డి జిల్లాల మధ్య కొత్తగా ఒక ఆర్థిక వ్యాపార వాణిజ్య జిల్లా పేరుతో వేలాది ఎకరాలు కంపెనీలకు కట్టబెట్టారు. దానికి ఆనుకునే ఎమ్మార్‌ ప్రాప ర్టీస్‌కు పునాదివేసి కోనేరు ప్రసాద్‌కు ఒక కొత్త సామ్రాజ్యాన్ని అప్పగించారు. పెద్ద పెద్ద చెరువులు పూడ్చేసి రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులకు ఇచ్చేసి మళ్లీ వర్షపు నీటి కోసం ఇంకుడు గుంతలు తవ్వించారు. రోడ్లు వెడల్పు చేసి వాటి మీద ఫైలై ఓవర్లు నిర్మించారు. ఈ అభివృద్ధిలో తన సామాజిక వర్గం వారిని భాగస్వాములను చేశారని వారి ద్వారా కోట్లాది రూపా యలు కొల్లగొట్టారన్నది ఇవాళ కోర్టు ముందున్న వాదన. వారిలో కొందరు ఆ వెంటనే పార్లమెంటు సభ్యులైపోయారు.

ఇంకొందరు పార్టీలో ముఖ్యనేతలుగా ఎదిగి తెలుగుదేశం పార్టీ ని నడిపిస్తున్నారు. మరికొందరు బాబుగారి బినామీలుగా ఆయన సంపదను కాపాడుతున్నారన్నది వాదన. ఈ కేసును వైఎస్‌ సతీమ ణి విజయమ్మ వేశారు. వైఎస్‌ ప్రజా ప్రస్థానం కూడా అదే బాటలో సాగింది. వైఎస్‌ కూడా హైదరాబాద్‌ చుట్టుపక్కల భూములతోనే వివాదస్పదుడయ్యారు. జగన్‌కు పెట్టుబడులు పెట్టిన వారంతా ప్ర త్యేక ఆర్థిక మండలాల పేరుతో వైఎస్‌ దగ్గర తెలంగాణ జిల్లాల్లో భూములు, జలయజ్ఞం కాంట్రాక్టులు, మరికొందరు హైదరాబాద్‌లో వక్ఫ్‌ భూములు, హౌసింగ్‌ బోర్డ్‌ భూములు అక్రమంగా పొంది విల్లాలు, టవర్లు కట్టారని అభియోగం.

ఇప్పటి పిల్లుల కథలో పిల్లులు, కోతులూ కలిసిపోయాయి. అభియోగాలను బట్టి ముసలమ్మ రొట్టెను కోతులకు కట్టబెట్టినట్టు తెలంగాణ భూములను తమ తమ బంధువులకు, వందిమాగధుల కు, బినామీలకు, వాళ్లు పెట్టిన కంపెనీలకు కట్టబెట్టారు. పాలన ఎవరిదైనా ప్రసాదంలా పంచుకున్నది మాత్రం సీమాంధ్ర పెట్టుబడి దారులే. వారిలో మెజారిటీ ఒకే సామాజిక వర్గానికి చెందినవాళ్లు. ఇప్పుడు పత్రికల్లో వస్తోన్న పేర్లు, అఫిడవిట్‌లో ప్రస్తావించిన పేర్లును పరిశీలిస్తే పదేళ్ళలో పంచిపెట్టిన వాళ్లు మారారు తప్ప పంచుకున్నది ఒక్కరే అని అర్థమౌతుంది. పది, పదిహేనేళ్ల కాలంలో హైదరాబాద్‌, నగరం చుట్టూ ఉన్న నాలుగైదు జిల్లాల్లో ఉన్న భూముల మీద లక్షల కోట్ల వ్యాపారం జరిగింది. కొందరు లక్షల కోట్లు సంపాదిస్తే వందలాదిమంది కోటీశ్వరులైపోయారు. అలాగే అనామకులు ఏ వన్‌ కాంట్రాక్టర్లుగా అవతారం ఎ త్తారు. అక్కడితో ఆగకుండా ఆ సంపదను కాపాడుకోవడం కోసం రాజకీయా పార్టీల్లో చేరో, పార్టీలు పెట్టో దేశసేవకు పునరంకితం కావాలని కలలుగం టున్నారు. సరిగ్గా ఈ ఇద్దరి పాలనలో పెట్టు బడిదారులుగా ఎదిగిన వాళ్లే తెలంగాణను అడ్డుకున్నారు. పార్లమెంటులో సమైక్యాంధ్ర ప్లకార్డ్‌ పట్టుకున్నది, రెండు కళ్ల సిద్ధాంతాలు పుట్టుకొచ్చింది ఈ పెట్టుబడిదారులను, వాళ్ల పెట్టుబడిని కాపాడుకోవడం కోసమే. ఇప్పుడు హైదరాబాద్‌ భవిష్యత్తు కోసం హైరానా పడుతున్న వాళ్లం తా వాళ్ల ఎంగిలి కూడికి అలవాటు పడ్డవాళ్ళే. వీళ్లకు ఈ రెం డు కేసుల మధ్య తెలంగాణ కోల్పోయిన లక్షలాది ఎకరాల భూములు, వేలాది రైతు కుటుంబాల వ్యథలు, శిథిలమైపోయిన బతుకులు కనిపించవు.

తెలంగాణ ఉద్యమంతో ఓట్లు, సీట్లు అని ఆ రాటపడే వాళ్లు, ఇదే పెట్టుబడి పార్టీలతో ఎన్నికలు, ఎత్తులు పొత్తులు అనుకునే వాళ్లు ఈ విషయాలను పట్టించుకోరు. కనీసం తెలంగాణ ఉద్య మకారులైనా ఈ విషయాన్ని తెరమీదికి తెచ్చి ఎవరి భూములు వారికి ఇప్పించే పోరాటం చేయవచ్చు. అలాంటి పోరాటం తెలంగా ణను దోచుకుని నిలబడ్డవాళ్లను నిలదీయడానికి, అడ్డుపడుతున్న వాళ్ల మెడలు పంచడానికి పనికొస్తుంది. అన్నిటి కన్నా సొంత భూముల్లో కూలీలై కునారిల్లుతున్న తెలంగాణ రైతుల బతుకులు బాగుపడతాయి.

– రూప గొండ
ఇద్దరూ దోచింది తెలంగాణనే !

నవంబర్‌ నెలకు తెలంగాణకు అవినాభావ సంబంధం ఉన్న ట్టుంది. తెలంగాణను ఆంధ్రప్రదే శ్‌లో కలిపింది నవంబర్‌ ఒకటి అయితే, ఆంధ్ర ప్రదేశ్‌ నుంచి తెలంగాణ విముక్తికి స్ఫూర్తిగా నిలి చింది కూడా నవంబర్‌ నెలనే. ఇటువంటి శీతాకాలంలోనే కేసీఆర్‌ తెలంగాణ కోసం తన ఆఖరి అస్త్రమైన నిరాహారదీక్షను ఉపయోగిం చారు. తెలంగాణ ఉద్యోగుల న్యాయమైన డిమాండు ఢిల్లీ వీధుల్లో నగుబాటుకు గురైన పరిస్థితుల్లో ఇక తెలంగాణ కోసం అమీతుమీ తేల్చుకోక తప్పదని గుర్తించి ఆయన నవంబర్‌ 29న ఆమరణ దీక్షకు దిగారు. అప్పటికి దశాబ్దాలుగా తెలంగాణ రాష్ట్రం కోసం క లలు కంటున్న వాళ్లు, తపిస్తున్న వాళ్లు అనేక మందే ఉండి ఉండవచ్చు. కానీ తెలంగాణను సక ల జనుల స్వప్నంగా మలచింది మాత్రం నవంబర్‌ 2009. ఇప్పుడు ఈ నవంబర్‌ పార్లమెంటు శీతా కాల సమావేశాల్లో అనూహ్యంగా తెలంగాణ డిమాండుకు ఉత్తరాది పార్టీల నుంచి విశేషమైన మ ద్దతు లభిస్తోంది. మాయావతి విసిరిన చిన్న రాష్ట్రాల వలలో చిక్కుకుని ఇప్పుడు పార్లమెంటులోని పెద్ద పార్టీలన్నీ విలవిలలాడుతున్నాయి. ఈసారి పార్లమెంటు చర్చల్లో తెలంగాణ ఒక ప్రధానమైన అంశంగా మారిపోయింది. రెండేళ్ల క్రితం కేసీఆర్‌ దీక్ష ప్రజలనే కాదు, రాష్ట్ర రాజకీయాల దశ ది శ పూర్తిగా మార్చేసింది. రాజకీయ పార్టీలు మొదలు చట్టసభల మీద విశ్వాసంలేని పార్టీలు, ఉద్యమాలు కూడా కేసీఆర్‌ నిర్దేశించిన ఏజెండాను ఎత్తుకున్నాయి. తెలంగాణలో మూడు దశాబ్దాల విముక్తి ఉద్యమాలకు, సామాజిక సాంస్కృతిక పోరాటాలకు సారథులుగా ఉన్న గద్దర్‌, విమలక్కతోపా టు మందకృష్ణ వంటి వారు కూడా ఏదో ఒక దశ లో కేసీఆర్‌ను బలపరిచిన వారే ఇప్పుడు వారు ఆయన మార్గంతో విభేదించవచ్చు.

కానీ అందరి గమ్యం ఒక్కటే అనడంలో సందేహాలు ఉండక్కర్లేదు. ఇవన్నీ కలిసే గడిచిన రెండేళ్లలో ఈ రాష్ట్రంలో తెలంగాణ తప్ప మరో వార్త లేని పరిస్థితి నెలకొంది. కానీ ఢిల్లీ పరిణామాలు ఎలా ఉన్నా తెలంగాణలో మాత్రం పరిస్థితి అంత ఆశావహంగాలేదు. ఉద్యమాల్లో పాల్గొన్న చాలా మంది ఇప్పటి పరిస్థితుల పట్ల కలవరపడుతున్నారు. రాజకీయ క్రీనీడలో మరోసారి తెలంగాణ తెర మరుగౌతుందా అన్న ఆందోళన వ్యక్తమౌతోంది. తెలంగాణ వచ్చే దాకా తెగించి పోరాడుదాం అన్న రాజకీయ నాయకులు డమ్మీ రాజీనామాలతో సహా తమ అమ్ములపొదిలోని అన్ని ఆస్త్రాలు చకచకా వాడేసి ఇప్పుడు చేతులెత్తి నిలబడ్డారు. ఇదే అదునుగా చంద్రబాబు రెండేళ్ల విరామం తరువా త తెలంగాణలో కాలుమోపి పునీతుడైపోయాడు. రేపో మాపో జగన్‌ మానుకోట కాకపోతే మరోబా ట గుండా తెలంగాణలో ప్రవేశించి ఓదార్పు పొం దుతాడు. ఇంకోవైపు తెలంగాణ తెచ్చేదీ ఇచ్చేదీ మేమే అన్న కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు కొత్తకొత్త కార్లలో ఇప్పుడు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి కాన్వా య్‌గా కదులుతున్నారు. అధిష్ఠానాన్ని ఒప్పించి తెలంగాణ తెస్తామన్న మంత్రులు ముఖ్యమంత్రి గారికి రక్షణ కవచమై రచ్చబండలో రేషన్‌ కార్డులు ఇప్పిస్తున్నారు. సందట్లో సడేమియాలుగా కొందరు విశాలాంధ్రవాదులు తెలంగాణ సంఘాల సహకారంతో జిల్లాలు తిరిగి సమైక్య స్వస్థత కూట ములు నిర్వహించే సన్నాహాల్లో ఉన్నారు. చారిత్రాత్మకమైన సకల జనుల సమ్మె ముగిసిన వెనుక చోటుచేసుకున్న ఈ పరిణామాలన్నీ చాలా మందినే కలవర పెడుతున్నాయి.

అంతకంటే కలవరపెట్టే వాస్తవాలను ఇప్పుడు సీబీఐ అవిష్కరి స్తోంది. హైకోర్టు ఆదేశాల మేర కు జగన్మోహన్‌ రెడ్డి, చంద్రబాబుల ఆస్తుల వివరాలు సేకరిస్తోన్న సీబీఐ ఇప్పుడు ఈ ఇద్దరు నేతలు ఎంత దోచుకున్నది లెక్కగట్టబోతోంది. ఇది రెండు పిల్లుల కథను గుర్తుకు తెస్తోంది. రెండు పిల్లులు, ఒక ముసలమ్మ ఇంట్లో దూరి ఆ ముసలమ్మ చేసి పెట్టుకున్న రొట్టె ముక్కను ఎత్తుకుపోతాయి. ఈ క థ, కథలోని నీతి అందరికీ తెలిసిందే. ఆ కథ మొదట్లో ఎవరు రాశారో ఎవరు చెప్పారో గానీ కొట్లా డుకోకుండా దోచుకున్న సొత్తు ను సమానంగా పంచుకోవాలన్నది ఈ కథలోని నీతి. ఆ నీతి సూత్రాన్ని అవినీతి పరులు చాలాకాలమే పాటిస్తూ వచ్చారు. న్యాయమని నమ్మించారు. తరతరాలుగా ఆ కథ చెప్తున్న, వింటున్న వాళ్లు పాపం పిల్లులు అనుకున్నారు. కానీ రొట్టె చేసుకున్న ముసల్ది ఏమై పోయిందో ఆలోచించలేదు. ఇవాళ మన తెలుగు మీ డియా కూడా అదే ధర్మమని భావిస్తున్నట్టుంది. కొద్దికాలంగా మన మీడి యాలో ఆస్తుల గొడవ నడుస్తోంది. ముఖ్యంగా జగన్‌ ఆస్తులమీద సీబీఐ విచారణ మొదలైనప్పటి నుంచి మన ఛానళ్లు పత్రికలూ ఆయన ఆస్తుల చిట్టా సేకరించే పనిలో ఉన్నాయి. వైఎస్‌ రాజశేఖర రెడ్డి లాగా మిత్రలాభం గురించి ఆలోచించి ఉంటే పరిస్థితులు వేరుగా ఉండేవేమో కానీ ఆయన కొంచెం ఆధునికుడు, ముల్లును ముల్లుతోనే తీయాలనుకుని ఇప్పుడు చంద్రబాబును కూడా సీబీఐ ఉచ్చులోకి దించాడు. సీబీఐ విచారణ సంగతేమో గానీ మీడియాకు మాత్రం ఇప్పుడు చేతినిండా పని దొరికింది. ఇరవై నాలుగు గంట లూ తెలుగు ఛానళ్లు విడతల వారీగా జగన్మోహనరెడ్డి, చంద్రబాబుల ఆస్తుల గురించి చర్చలు, వాదోపవాదాల చేస్తోన్నాయి.

అసలు ఈ సొమ్మంతా ఎవరిది, ఇన్ని లక్షలు ఎక్కడి నుంచి సృష్టించారు అన్న విషయాల మీదికి చర్చ వెళ్ళకుండా మీడియా ఇప్పుడు పిల్లుల గురిం చి, పిల్లులకు వాటాలిచ్చిన కోతుల గురించి కథ లు కథలుగా కథనాలను ప్రసారం చేస్తున్నది. సీబీ ఐ, విచారణలు, కోర్టుల తీర్పులు ఎలా ఉన్నా ఈ రెండు కేసుల్లో ఇప్పటికే నష్టం జరిగింది మాత్రం తెలంగాణకు వీళ్లు అమ్ముకున్నా రనో, పంచి పెట్టారనో లేదా కేటాయించారనో చెపుతున్న భూముల న్నీ తెలంగాణ ప్రాంతలోనివి. అందునా ఎక్కువ హైదరాబాద్‌ చూట్టూ ఉన్నవి. రాజశేఖర్‌రెడ్డి చం ద్రబాబు వేరు వేరు వ్యక్తులు కావొచ్చు, వేరు వేరు పార్టీల్లో ఉండవచ్చు. వేరు వేరు జెండాలతో ఎన్ని కల్లో పోటీ పడి ఉండవచ్చు. కానీ ఇద్దరి ఎజెండా ఒకటే అన్నది మాత్రం ఇప్పుడిప్పుడే సీబీఐ వెలికి తీస్తున్న వివరాలను బట్టి తెలుస్తున్నది. ఇద్దరూ హైదరాబాద్‌ను, దాని చుట్టూ పక్కల ఉన్న భూములను ఆధారంగా చేసుకుని తమ తమ అభివృద్ధి ప్రణాళికల ను అమలు చేశారు. రెండు పిల్లుల కథ లో ఒక పిల్లి దోచుకొస్తే ఇంకొక పిల్లి కాపలా ఉం టుంది. బాబు అధికారంలోకి ఉన్నప్పుడు ఐదేళ్ల పాటు వైఎస్‌ ప్రధాన కాపలాదారుగా ఉండాల్సిన ప్రతిపక్ష నాయకుడు. ఆ తరువాత వైఎస్‌ అధికారంలోకి వచ్చాక ఐదేళ్లపాటు బాబు కాపలా దారు. ఏవో క్షణికావేశంలో అప్పుడప్పుడు విమర్శిం చుకునే వారు తప్ప కోర్టులు కేసుల జోలికి వెళ్లలేదే ప్పుడు. కేసులు వేసుకున్నా అవి విచారణ దాక వె ళ్లేలోపే రాద్ధాంతం లేకుండా రాజీ పడిపోయారు. వైఎస్‌ హఠాన్మరణం తరువాత జగన్‌ అతని వార సునిగా అవతరించడం చంద్రబాబు రాజకీయ ప్రస్థానానికి ఊహిం చని అడ్డంకిగా మారింది.

ఈ దశలో తెలుగుదేశం ఔత్సాహికులు కొందరు వైఎస్‌ అక్ర మాలు, జగన్‌ ఆస్తుల మీద కేసు వేసి ఇరుకున పెట్టాలని భావించి ఉంటారు. అదే కోణం చూపిస్తూ ఎర్రన్నాయుడు హైకోర్టులో కేసు వేశారు. హైకోర్టు ఆ కేసును సీబీఐకి అప్పగించడంతో అప్పటికి కాంగ్రెస్‌ ఎదురుదాడిలో గాయపడి ఉన్న జగన్‌కు పుండు మీద కారం చల్లినట్టయింది. దీంతో అక్రమ ఆస్తుల కేసులో విచారణను ఎదుర్కొంటున్న జగన్‌ తల్లి విజయమ్మ చంద్ర బాబు ఆస్తుల మీద విచారణకు కోర్టును ఆశ్రయించారు. ఆమె కేవలం పిటిషన్‌ మాత్ర మే కాక దానితో పాటు వేలాది పేజీల ఆధారాల పత్రాలు కూడా కోర్టుకు సమర్పించారు. ఇట్లా కాలం నడిచినంత కాలం ఒకరికొక రుగా ఉన్న రెండు కుటుంబాలు ఇవాళ సీబీఐ విచారణలో ఉన్నారు.

రాజశేఖర్‌రెడ్డి, చంద్రబాబు ఒకేసారి రాజకీ యాల్లోకి వచ్చారు. కానీ చంద్రబాబు మాత్రం ముందుగా అధికారంలోకి వచ్చారు. ప్రపంచంలో ఐటీకి ఆదరణ ఉన్న రోజుల్లో అధికారంలోకి వచ్చి న చంద్రబాబు హైదరాబాద్‌ రూపురేఖలను మార్చేసే పనికి పూనుకు న్నాడు. ప్రపంచబ్యాంకు మద్ద తుతో అభివృద్ధి నిర్వచనాన్ని మార్చేసి హైదరాబాద్‌ అభివృద్ధే ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి అని, హైదరాబాద్‌ను ఐటీ రాజధాని చేస్తానని వేలాది ఎకరాలు ప్రభుత్వ భూములను, పేద రైతుల భూములను బడా పెట్టుబడిదారులకు కట్టబెట్టారు. హైటెక్‌ సిటి నిర్మాణానికి దేశంలోని బడా కాంట్రాక్టర్లతో బేరసా రాలు కుదిర్చారు. సత్యం రామలింగరాజుతో స్నేహం చేశారు. ఆ స్నేహంతో అమెరికా అధినేతనే అతిథిగా పిలుచుకోగలిగారు. ఒక్క హైటెక్‌ సిటితో ఆగకుండా ఫార్మా సిటీలు మొదలు ఫిలింసిటీల దాకా వేలాది ఎకరాల తెలంగాణ భూములను ధారాదత్తం చేశారు. అంతేకాదు హైదరాబాద్‌ రంగారెడ్డి జిల్లాల మధ్య కొత్తగా ఒక ఆర్థిక వ్యాపార వాణిజ్య జిల్లా పేరుతో వేలాది ఎకరాలు కంపెనీలకు కట్టబెట్టారు. దానికి ఆనుకునే ఎమ్మార్‌ ప్రాప ర్టీస్‌కు పునాదివేసి కోనేరు ప్రసాద్‌కు ఒక కొత్త సామ్రాజ్యాన్ని అప్పగించారు. పెద్ద పెద్ద చెరువులు పూడ్చేసి రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులకు ఇచ్చేసి మళ్లీ వర్షపు నీటి కోసం ఇంకుడు గుంతలు తవ్వించారు. రోడ్లు వెడల్పు చేసి వాటి మీద ఫైలై ఓవర్లు నిర్మించారు. ఈ అభివృద్ధిలో తన సామాజిక వర్గం వారిని భాగస్వాములను చేశారని వారి ద్వారా కోట్లాది రూపా యలు కొల్లగొట్టారన్నది ఇవాళ కోర్టు ముందున్న వాదన. వారిలో కొందరు ఆ వెంటనే పార్లమెంటు సభ్యులైపోయారు.

ఇంకొందరు పార్టీలో ముఖ్యనేతలుగా ఎదిగి తెలుగుదేశం పార్టీ ని నడిపిస్తున్నారు. మరికొందరు బాబుగారి బినామీలుగా ఆయన సంపదను కాపాడుతున్నారన్నది వాదన. ఈ కేసును వైఎస్‌ సతీమ ణి విజయమ్మ వేశారు. వైఎస్‌ ప్రజా ప్రస్థానం కూడా అదే బాటలో సాగింది. వైఎస్‌ కూడా హైదరాబాద్‌ చుట్టుపక్కల భూములతోనే వివాదస్పదుడయ్యారు. జగన్‌కు పెట్టుబడులు పెట్టిన వారంతా ప్ర త్యేక ఆర్థిక మండలాల పేరుతో వైఎస్‌ దగ్గర తెలంగాణ జిల్లాల్లో భూములు, జలయజ్ఞం కాంట్రాక్టులు, మరికొందరు హైదరాబాద్‌లో వక్ఫ్‌ భూములు, హౌసింగ్‌ బోర్డ్‌ భూములు అక్రమంగా పొంది విల్లాలు, టవర్లు కట్టారని అభియోగం.

ఇప్పటి పిల్లుల కథలో పిల్లులు, కోతులూ కలిసిపోయాయి. అభియోగాలను బట్టి ముసలమ్మ రొట్టెను కోతులకు కట్టబెట్టినట్టు తెలంగాణ భూములను తమ తమ బంధువులకు, వందిమాగధుల కు, బినామీలకు, వాళ్లు పెట్టిన కంపెనీలకు కట్టబెట్టారు. పాలన ఎవరిదైనా ప్రసాదంలా పంచుకున్నది మాత్రం సీమాంధ్ర పెట్టుబడి దారులే. వారిలో మెజారిటీ ఒకే సామాజిక వర్గానికి చెందినవాళ్లు. ఇప్పుడు పత్రికల్లో వస్తోన్న పేర్లు, అఫిడవిట్‌లో ప్రస్తావించిన పేర్లును పరిశీలిస్తే పదేళ్ళలో పంచిపెట్టిన వాళ్లు మారారు తప్ప పంచుకున్నది ఒక్కరే అని అర్థమౌతుంది. పది, పదిహేనేళ్ల కాలంలో హైదరాబాద్‌, నగరం చుట్టూ ఉన్న నాలుగైదు జిల్లాల్లో ఉన్న భూముల మీద లక్షల కోట్ల వ్యాపారం జరిగింది. కొందరు లక్షల కోట్లు సంపాదిస్తే వందలాదిమంది కోటీశ్వరులైపోయారు. అలాగే అనామకులు ఏ వన్‌ కాంట్రాక్టర్లుగా అవతారం ఎ త్తారు. అక్కడితో ఆగకుండా ఆ సంపదను కాపాడుకోవడం కోసం రాజకీయా పార్టీల్లో చేరో, పార్టీలు పెట్టో దేశసేవకు పునరంకితం కావాలని కలలుగం టున్నారు. సరిగ్గా ఈ ఇద్దరి పాలనలో పెట్టు బడిదారులుగా ఎదిగిన వాళ్లే తెలంగాణను అడ్డుకున్నారు. పార్లమెంటులో సమైక్యాంధ్ర ప్లకార్డ్‌ పట్టుకున్నది, రెండు కళ్ల సిద్ధాంతాలు పుట్టుకొచ్చింది ఈ పెట్టుబడిదారులను, వాళ్ల పెట్టుబడిని కాపాడుకోవడం కోసమే. ఇప్పుడు హైదరాబాద్‌ భవిష్యత్తు కోసం హైరానా పడుతున్న వాళ్లం తా వాళ్ల ఎంగిలి కూడికి అలవాటు పడ్డవాళ్ళే. వీళ్లకు ఈ రెం డు కేసుల మధ్య తెలంగాణ కోల్పోయిన లక్షలాది ఎకరాల భూములు, వేలాది రైతు కుటుంబాల వ్యథలు, శిథిలమైపోయిన బతుకులు కనిపించవు.

తెలంగాణ ఉద్యమంతో ఓట్లు, సీట్లు అని ఆ రాటపడే వాళ్లు, ఇదే పెట్టుబడి పార్టీలతో ఎన్నికలు, ఎత్తులు పొత్తులు అనుకునే వాళ్లు ఈ విషయాలను పట్టించుకోరు. కనీసం తెలంగాణ ఉద్య మకారులైనా ఈ విషయాన్ని తెరమీదికి తెచ్చి ఎవరి భూములు వారికి ఇప్పించే పోరాటం చేయవచ్చు. అలాంటి పోరాటం తెలంగా ణను దోచుకుని నిలబడ్డవాళ్లను నిలదీయడానికి, అడ్డుపడుతున్న వాళ్ల మెడలు పంచడానికి పనికొస్తుంది. అన్నిటి కన్నా సొంత భూముల్లో కూలీలై కునారిల్లుతున్న తెలంగాణ రైతుల బతుకులు బాగుపడతాయి.

– రూప గొండ