ఉత్పత్తితో సంబంధం లేకుండా వినియోగం పెరిగింది
హైదరాబాద్ : ఉత్పత్తితో సంబంధం లేకుండా విద్యుత్ వినియోగం పెరిగిందని పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ అన్నారు. ప్రతిపక్షాల మాయమాటలను పట్టించుకోకుండా ప్రభుత్వం పనిచేస్తోందని, ప్రజలు కాంగ్రెస్తోనే ఉన్నారని ఆయన పేర్కొన్నారు. అందుకు సహకార సంఘాల ఎన్నికలే నిదర్శనమని బొత్స విలేకరుల సమావేశంలో అన్నారు.