ఉప్పర బస్తీ ఒక ఇంట్లో దొంగలు పడ్డారు
సికింద్రాబాద్ (జనం సాక్షి ) : ఉప్పర్ బస్తి నాలా పక్కన ఒక ఇంట్లో శుక్రవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఐదు తులాల బంగారు, 30 వేల నగదు దొంగలించిన్న దొంగలు . బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం తను తన భర్త గురువారం సాయంత్రం బోయినపల్లికి తన బంధువుల ఇంటి కి వెళ్లిన సమయం లో గుర్తు తీయని వ్వక్తి ఇంట్లో కి చొరబండి , బీరువా తాళం పలగొట్టి బీరువాలో ఉన్న ఐదు తులాల బంగారం, 30 వేల నగదు దొంగలించుకుని వెళ్లారు. శుక్రవారం రోజు ఉదయం వచ్చి చూసే వరకు బీరువా తాళాలు పగలగొట్టుకున్నయి. బంగారం నగదు పోవడంతో స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు . చిలకలగూడ పోలీస్ స్టేషన్ డి ఐ నాగేశ్వరరావు , డిటెక్టివ్ ఎస్సై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు . సి సి ఫుటేజీ ఆధారంగా నిందితుని పట్టుకునే పనుల లో నిమగ్నమైన చిలకలగూడ పోలీసులు .