ఎసిబి వలలో విద్యుత్ ఇంజనీర్
హైదరాబాద్,ఆగస్ట్8(జనం సాక్షి): విద్యుత్ శాఖ డిఇ ఎసిబికి చిక్కారు. బిల్లులు మంజూరు చేయడానికి గుత్తేదారు నుంచి యాబై వేల రూపాయలను లంచంగా తీసుకుంటుండగా ఎసిబి అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. సైదాబాద్ గ్రీన్ పార్కు కాలనీలోని తన ఇంట్లో లంచం తీసుకుంటుండగా ఎసిబికి చిక్కారు. దుర్గారావు భువనగిరి టిఎస్ఎస్పిడిసిఎల్ డిఇగా పని చేస్తున్నాడు. దుర్గారావును అరెస్టు చేశామని, ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నామని ఎసిబి అధికారులు తెలిపారు.



