కొనసాగుతున్న వైకాపా ఆధిక్యం

హైదరాబాద్‌: 18 అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికల కౌంటింగ్‌ ఉదయం ప్రారంభమైంది. ఇప్పటి వరకు అందిన ఫలితాల్లో  వైకాపా ఎమ్మిగనూరు స్థానంలో  గెలుపొందగా  14 చోట్ల ముందంజలో కొనసాగుతోంది. ఆరు రౌండ్ల లెక్కింపు  పూర్తయ్యేసరికి తిరుపతి, ఆళ్లగడ్డ, రాయచోటి, రాయదుర్గం, రాజంపేట, మాచర్ల, అనంతపురం, రామచంద్రాపురం, పోలవరం, ప్రత్తిపాడు,ఒంగోలు,నరసన్నపేట, రైల్వేకోడూరులో ఆ పార్టీ ఆభ్యర్థులు కొనసాగుతున్నారు