గోశాల కోడె దూడల తరలింపు వ్యవహారంపై చర్యలు

విశాఖ : సింహాచలం గోశాల కోడె దూడల తరలింపు వ్యవహారంపై ఆలయ అధికారులు స్పందించారు. ఆలయ సూపరింటెండెంట్‌ గోపీనాథ్‌ను ఈవో రామచంద్రమోహన్‌ సస్పెండ్‌ చేశారు. గోశాల నుంచి ఈ ఉదయం 12 కోడె దూడలను అక్రమంగా తరలిస్తుండగా తరలిస్తుండగా స్థానికులు పట్టుకుని అధికారులకు అప్పగించారు.