చంచల్‌గూడ జైలుకు చేరుకున్న ఈడీ బృందం

హైదరాబాద్‌: అక్రమాస్తుల కేసులో అరెస్ట్తన వైకాపా అధ్యక్షుడు జగన్‌ను విచారించేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులు చంచల్‌గూడ జైలుకు చేరుకున్నారు. ఫెమా, మనీల్యాండరింగ్‌ చట్టాల కింద ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు న్యాయవాది సమక్షంలో జగన్‌ను ఈడీ బృందం ప్రశ్నించనుంది.