తొలిరోజు ముగిసిన కౌన్సిలింగ్‌

ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం: రాష్ట్రంలోని నాలుగు ఆన్‌లైన్‌ కేంద్రాల్లో శుక్రవారం ప్రారంభమైన ఎంబీబీఎస్‌ కౌన్సిలింగ్‌ ముగిసే సమయానికి 866సీట్లు భర్తీ అయ్యాయి. హైదరాబాద్‌ జేఎన్‌టీయూలో 422, విజయవాడలో ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయంలో 243, విశాఖ ఏయూలో 89, తిరుపతి ఎస్వీయూలో 120మంది అభ్యర్థులు కౌన్సిలింగ్‌కు హజరయ్యారు. శనివారం ఎంసెట్‌ మెరిట్‌ ఆర్డర్‌ 901నుంచి 2400వరకు ఓపెన్‌కేటగిరీ అభ్యర్థులకు కౌన్సిలింగ్‌ జరగనుంది.