నగల దుకాణంలో చోరీ

హైదరాబాద్‌: తార్నాకాలోనిగోల్డ్‌ వరల్డ్‌ నగల దుకాణంలో చోరీ జరిగింది. దొంగలు నిన్న రాత్రి దుకాణం తాళాలు బద్దలుకొట్టి లోనికి చొరబడి30 తులాల బంగారం,5కిలోల వెండిని దోచుకెళ్లినట్లు యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.పోలీసులు క్లూస్‌టీంతో ఘటనాస్థలికి చేరుకొని విచారణ చేపట్టారు.