నాగ్‌పూర్‌ టెస్ట్‌ డ్రా

నాగ్‌పూర్‌: అశించినట్లుగానే భారత్‌, ఇంగ్లండ్‌ జట్ల మధ్య జరిగిన నాగ్‌పూర్‌ టెస్ట్‌ డ్రాగా ముగిసింది. ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌ 330, రెండో ఇన్నింగ్స్‌ 352/4 భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ 326/9 డిక్లేర్డ్‌, నాలుగు టెస్టుల సిరీస్‌ను 2-1తో ఇంగ్లండ్‌ కైవసం చేసుకుంది. ఈ విజయంతో 28 ఏళ్ల తర్వాత ఇంగ్లండ్‌ భారత్‌లో టెస్ట్‌ సిరీస్‌ గెలుచుకున్నట్లయింది.