నిరుద్యోగ యువతను మోసం చేశారు

` బీఆర్‌ఎస్‌ పదేళ్ళ పాలనలో అవినీతి ఆకాశన్నంటింది
` కాంగ్రెస్‌ అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించి అసెంబ్లీకి పంపాలి
` గద్వాలలో భారీ బహిరంగ సభలో ప్రియాంక
` తొమ్మిదేళ్లలో దగాపడ్డ తెలంగాణ.. ప్రజలు ఆలోచించి ఓటేయాలి
` ప్రజల సంక్షేమమే కాంగ్రెస్‌ లక్ష్యం
` భువనిగిరి రోడ్‌షోలో ప్రియాంక
గద్వాలనడిగడ్డ,యాదాద్రి భువనగిరి(జనంసాక్షి):తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచార పర్వంలో కాంగ్రెస్‌ పార్టీ దూసుకుపోతుందనీ ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ అన్నారు. ప్రచారంలో భాగంగా సోమవారము గద్వాలలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో  కాంగ్రెస్‌ పార్టీ నాయకురాలు   ప్రియాంక గాంధీ ఈ సందర్భంగా మాట్లాడుతూబీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో అవినీతి ఆకాశన్నంటిందన్నారు. రెండు సార్లు అధికారం ఇస్తే బీఆర్‌ఎస్‌ ఏం చేసిందని ప్రియాంక గాంధీ ప్రశ్నించారు. మళ్లీ బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వస్తే భూ మాఫియా లేస్తుందని..ధరణి పోర్టల్‌ పేరుతో ఇళ్లు, వాకిళ్లు, భూములు లాక్కుంటారని అన్నారు. ప్రశ్నా పత్రాలు లీక్‌ అవుతాయని.. మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు అలాగే కొనసాగుతాయని మండిపడ్డారు. ప్రాజెక్టులన్నీ ఎక్కడికక్కడే ఆగిపోయాయని.. యువత ఆశలపై కేసీఆర్‌ సర్కారు నీళ్లు చల్లిందన్నారు. కాంగ్రెస్‌ కు ఒక్క అవకాశం ఇస్తే అభివృద్ధి చేసి చూపిస్తామని.. ఆరు గ్యారంటీలు పక్కాగా అమలు చేస్తామని చెప్పారు. తెలంగాణ ప్రజల కష్టాలు తీరాలంటే కాంగ్రెస్‌ అధికారంలోకి రావాలన్నారు.ప్రజలకు సాయం చేయాలన్న ఆలోచన బీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి లేదని ప్రియాంక గాంధీ మండిపడ్డారు. నిరుద్యోగులు ఎంతో ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వారికి ఉద్యోగులు రాలేదు. ఉపాధిలేదన్నారు. ఈ ప్రభుత్వం కళ్లు మూసుకుని నిద్రపోతోందన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలకు బీఆర్‌ఎస్‌ చేసిందేమి లేదన్నారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు..గద్వాల ప్రాంతంలో చాలా అవినీతి జరిగిందన్నారు. లంబాడీల కోసం కార్పొరేషన్‌ ఏర్పాటు చేస్తామని తెలిపారు. సోనియా గాంధీ ప్రజల పక్షాన ఉన్నారన్నారు. తెలంగాణ బిడ్డలు బాగుండాలని కోరుకున్నారని అందుకే ప్రత్యేక రాష్ట్రం ఇచ్చారని తెలిపారు.గులాబీ పార్టీ నేతలు విలాసవంతమైన భవంతుల్లో నివసిస్తున్నారని.. కానీ పేదలు మరింత పేదరికంలోకి వెళ్లారన్నారు. కాంగ్రెస్‌ పార్టీతోనే ప్రజా ప్రభుత్వం ఏర్పడుందన్నారు. రాజస్థాన్‌, చత్తీస్‌ గఢ్‌ మాదిరిగానే ఇక్కడ ఉద్యోగాలు ఇస్తామన్నారు. కాంగ్రెస్‌ ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతుందన్నారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌ అన్నదమ్మలు గా పనిచేస్తున్నాయని, ఈ రెండు పార్టీలకు చిన్నతమ్ముడిగా ఎంఐఎం పార్టీ ఉందన్నారు. గద్వాల నియోయోజకవర్గంలో సరిత ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జాతీయ, రాష్ట్ర, జిల్లా, మండల నాయకులు పాల్గొన్నారు.
తొమ్మిదేళ్లలో దగాపడ్డ తెలంగాణ
యాదాద్రి భువనగిరి(జనంసాక్షి): బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తొమ్మిదేళ్లలో తెలంగాణ ప్రజలకు ఏం చేసిందనే విషయాన్ని పదిసార్లు ఆలోచించుకుని నిర్ణయం తీసుకోవాలని కాంగ్రెస్‌ అగ్రనేత ప్రియాంక గాంధీ అన్నారు. ఇచ్చిన తెలంగాణలో బాగుపడ్డది కేవలం కెసిఆర్‌ కుటుంబం మాత్రమేనని అన్నారు. అవినీతిలో కూరుకుపోయిన ఈ ప్రభుత్వాన్ని సాగనంపాలని అన్నారు. ప్రతి ఒక్కరి జీవితంలో చాలా కష్టాలు ఉన్నాయని ఇక్కడున్న చిన్న దుకాణాలు, రైతులు, విద్యార్థులు, చిన్న చిన్న పనులు చేసుకునేవారు ఎంతో కష్టపడుతున్నారని ఈ విషయం తనకు తెలుసునని ఆమె అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం ఆమె భువనగిరిలో రోడ్‌ షోలో మాట్లాడుతూ… విూ దైనందిన జీవితంలో ప్రతి రోజూ పడుతున్న కష్టాల్లో .. ప్రభుత్వం నుంచి ఏం ఆశిస్తున్నారో అవి విూకు వస్తున్నాయా? అని అడిగారు. ఈ సర్కర్‌పై అటువంటి ఆశ ఉందా?.. ప్రజల సమస్యలపట్ల ప్రభుత్వానికి అవగాణ లేదని ఆమె విమర్శించారు. నోట్ల రద్దు సమయంలో ఏటీఎం, బ్యాంకుల నుంచి డబ్బులు తీసుకునే విషయంలో ప్రజలు చాలా కష్టపడ్డారని, తర్వాత కరోనా వచ్చి ఎన్నో ఇబ్బందులు వచ్చాయని ప్రియాంక గాంధీ అన్నారు. కానీ ఈ ప్రభుత్వం ప్రజల కష్టాల్లో అండగా నిలబడలేదని ఆమె తీవ్ర స్థాయిలో విమర్శించారు. తెలంగాణలో యువతకు ఉద్యోగాలు కావాలనే ఆశ ఉందా? విూ కల నెరవేరాలంటే కాంగ్రెస్‌కు ఓట్లు గెలిపించాలని కోరారు. నిత్యావసర ధరలు విపరీతంగా పెరిగాయని విమర్శించారు. కేసీఆర్‌ ప్రభుత్వం కళ్లు మూసుకుని నిద్రపోతోందని, వ్యవసాయం చేసుకునే రైతులకు లోన్లు రావని, రుణమాఫీ జరగదని, ప్రజల సమస్యలు పట్టించుకునే పరిస్థితిలో ఈ ప్రభుత్వం లేదని మండిపడ్డారు. నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ఎంతో కష్టపడి చదివి, పరీక్షలు రాస్తే.. ఆ ప్రశ్నాపత్రాలు లీక్‌ అయ్యాయని ఆమె ఆరోపించారు. పై నుంచి కింద వరకు ఈ ప్రభుత్వంలో ఎక్కడ చూసినా అవినీతి మయమేనని, కళేశ్వరం ప్రాజెక్టులో ఎంత అవినీతి జరిగిందో అందరికీ తెలిసిన విషయమనని అన్నారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌ పార్టీలు అధికారం కోసం చూస్తాయని, ప్రజల కష్టాలను పట్టించుకోవని విమర్శించారు. తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం తేవడం కోసం విూ హక్కును అమ్ముకోరనే విషయాన్ని ఈ ఎన్నికల ద్వారా తెలియజేయాలని, బీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి బుద్ది చెప్పాల్సిన సమయం వచ్చిందని ప్రియాంక గాంధీ అన్నారు.