నేడు తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీల భేటీ

హైదరాబాద్‌: తెలంగాణ అంశంపై ఆజాద్‌ ప్రకటన నేపథ్యంలో భవిష్యత్‌ కార్యాచరణపై చర్చించేందుకు తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీలు ఈ రోజు భేటీ అవుతున్నారు. ప్రత్యేక రాష్ట్ర సాధన దిశగా అధిష్ఠానంపై ఒత్తిడి పెంచే వ్యూహాలపై ఈ భేటీలో నేతలు చర్చించనున్నారు. ఎంపీ మందా జగన్నాథం నివాసంలో ఈ భేటీ జరగనుంది.