పీఎన్‌ఎల్‌వీ-సీ21ను పరిశీలించిన ప్రధాని

నెల్లూరు: భారత ప్రధాని మన్మోహన్‌సింగ్‌ భారత అంతరిక్ష కేంద్రం షార్‌లో మొదటి రోజు పర్యటన ముగిసింది. చెన్నై నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో నెల్లూరు జిల్లా శ్రీహరి కోటకు చేరుకున్న ఆయనకు గవర్నర్‌ నరసింహన్‌, సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డిలు ఘనంగా సత్కరించారు. అనంతరం మన్మోహన్‌సింగ్‌ పీఎన్‌ఎల్‌వీ-సీ21 లాంచ్‌ప్యాడ్‌ను పరిశీలించారు. అనంతరం రెండో ల్యాంచ్‌ప్యాడ్‌పై ఉన్న జీఎన్‌ఎల్‌వీ-2 ఉపగ్రహ నమూనాను ప్రధాని పరిశీలించారు.