ప్రతిభాపాటిల్‌కు ఎంపీల వీడ్కోలు

న్యూఢిల్లీ:త్వరలో పదవీ కాలం పూర్తి చేసుకుంటున్న రాష్ట్రపతి ప్రతిభాపాటిల్‌కు పార్లమెంట్‌ సభ్యులు జులై 23న వీడ్కోలు పలకనున్నారు.పార్లమెంట్‌ సెంట్రల్‌ హల్‌లో ఏర్పాటు చేయనున్న వీడ్కోలు కార్యక్రమానికి హజరు కావాలని ప్రతిభా పాటిల్‌ను లోక్‌సభ స్పీకర్‌ మీరాకుమార్‌ ఆహ్వనించారు.ఇందుకు ఆమె అంగీకరించారు. రాజ్యసభ ఛైర్యన్‌,ఉపరాష్ట్రపతి హమీద్‌ అన్సారీ మీరాకుమార్‌,ప్రదానమంత్రి మన్మోహన్‌సింగ్‌,అన్ని పార్టీల ఉభయం సభల సభ్యులు రాష్ట్రపతి వీడ్కోలు కార్యక్రమానికి హజరు కానున్నారు.