బీజేపీ, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు మాతో టచ్‌లో ఉన్నారు

` అక్ష్మణ్‌ అతిగా ఊహించుకుంటున్నారు
` మీడియా సమావేశంలో జగ్గారెడ్డి వ్యాఖ్య
హైదరాబాద్‌(జనంసాక్షి):లోక్‌సభ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని.. ఎక్కడా అధికార దుర్వినియోగం జరగలేదని కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జగ్గారెడ్డి అన్నారు. ఓటర్లు కూడా అధిక సంఖ్యలో తరలివచ్చి తమ ఓటును వినియోగించుకున్నారని అన్నారు. ఎన్‌ఇనకలు ప్రశాంత నిర్వహణకు తాము కూడా సహకరించామని అన్నారు. మంగళవారం గాంధీభవన్‌లో జగ్గారెడ్డి విూడియా సమావేశంలో మాట్లాడుతూ.. లోక్‌సభ ఎన్నికల్లో తాము అధికారంలో ఉన్నాం కదా అని ఎవరికి ఇబ్బంది కలిగేంచేలా ప్రవర్తించలేదని చెప్పారు. పోలీసులు వ్యవస్థని దుర్వినియోగం చేయలేదన్నారు. స్వేచ్ఛగా ప్రశాంతంగా ఎన్నికలు జరిపించటంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం సక్సెస్‌ అయిందని తెలిపారు.బీజేపీ అవాస్తవాలు మాట్లాడుతోందన్నారు. తమ ప్రభుత్వ పథకాలతో ప్రజలు సంతోషంగా ఉన్నారని వివరించారు. దేవుళ్లను అడ్డుపెట్టుకుని బీజేపీ రాజకీయం చేస్తోందని ఆరోపించారు. 65 సీట్లు ఉన్న కాంగ్రెస్‌ ఎందుకు పడిపోతుందని బిజెపి నేత లక్ష్మణ్‌ను ఆయన ప్రశ్నించారు. లక్ష్మణ్‌ ప్రెస్‌ విూట్‌ ద్వారా కాంగ్రస్‌ పార్టీపై అసత్యాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ ఎంపీ లక్ష్మణ్‌ పండితుడు లెక్క జాతకాలు చెబుతున్నారని ఎద్దేవా చేశారు. ఆగస్టులో కాంగ్రెస్‌ గవర్నమెంట్‌ సంక్షోభంలో పడుతుందని లక్ష్మణ్‌ ఎలా అన్నారని నిలదీశారు. బీఆర్‌ఎస్‌ పార్టీని కాంగ్రెస్‌ లో విలీనం చేస్తారు అనటంలో అర్థం ఏంటని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక ప్రజలు తమ పథకాలతో సంతోషంగా ఉన్నారని తెలిపారు. బీజేపీ నాయకులు గందరగోళం అవుతూ ప్రజలను కూడా గందరగోళంలో పడేస్తున్నారని అన్నారు. హావిూలు ఇచ్చి ఎగనామంపెట్టడంలో బీజేపీ నాయకులు దిట్టలని విమర్వలు గుప్పించారు. ప్రతివిషయంలో బీజేపీ నేతలు దేవుడిని అడ్డం పెట్లుకుని ప్రగల్భాలు పలుకుతారని విమర్శించారు. మోసం అంటే ఎలా ఉంటుందో కూడా కాంగ్రెస్‌కి తెలియదన్నారు. చెప్పిన పని ఇచ్చిన మాట చేయడం మాత్రమే కాంగ్రెస్‌ పార్టీకి తెలుసునని అన్నారు. ఎమ్మెల్యేలు మనసు మార్చుకుని రావటం వేరని.. విలీనం వేరని.. ఈ విషయంలో లక్ష్మణ్‌ రాంగ్‌ స్టేట్‌ మెంట్‌ ఇచ్చారని చెప్పారు. బీఆర్‌ఎస్‌ నుంచి నుంచి ఒక 20 మంది.. బీజేపీ నుంచి ఒక 5 మంది ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారని.. ఆ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లోకి రావడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు. అలా వస్తే తమకు 90 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంటుందని చెప్పారు. లక్ష్మణ్‌కి పొలిటికల్‌ చిప్‌ కారాబ్‌ అయినట్టు ఉందని ఎద్దేవా చేశారు. కొత్త చిప్‌ వేసుకొని రావలని… కావాలంటే దానికి అయ్యే ఖర్చు కాంగ్రెస్‌ పార్టీనే ఇస్తుందని జగ్గారెడ్డి సెటైర్లు గుప్పించారు.