మరో 48 గంటల్లో అల్పపీడనం

విశాఖ:  ఉత్తర బంగాళాఖాతంలో మరో 48 గంటల్లో అల్పపీడనం ఏర్పడడానికి అనుకూల వాతావరణం ఉందని విశాఖలోని తుఫాను హెచ్చరికల  కేంద్ర అధికారులు తెలియజేశారు. దీని ప్రభావంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అన్నారు. కోస్తాంధ్ర తీరం వెంబడి గంటకు 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో  బలమైన ఈదురుగాలులు వీస్తాయని సముద్రంలో వేటకు వెళ్లే మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాని హెచ్చరించారు.