మూడో వికెట్‌ కోల్పోయిన న్యూజిలాండ్‌

బెంగళూరు: భారత్‌తో జరుగుతున్న రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్‌ మూడో వికెట్‌ను కోల్పోయింది. ఆశ్విన్‌ బౌలింగ్‌లో విలియమ్‌సన్‌ 13 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద సెహ్వాగ్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. అంతకుముందు యాదవ్‌ బౌలింగ్‌లో మెక్కలమ్‌ (23), గుప్తిల్‌ (7) వెనుదిరిగారు. 21 ఓవర్లు ముగిసేసరికి కివీస్‌ మూడు వికెట్ల నష్టానికి 74 పరుగులు చేసింది.