‘శాంతియుతంగా ఆకాంక్షను తెలియజేద్దాం’

మెదక్‌: ఆత్మగౌరవాన్ని తెలియడానికి తెలంగాణ మార్చ్‌ ఒక మంచి వేదిక అని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌రావు పేర్కొన్నారు. సిద్ధిపేటలో తెలంగాణవాదులు చేపట్టిన దీక్షలు 1000 రోజులకు చేరడంతో వారికి హరీష్‌రావు సంఘీభావం తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… శాంతియుతంగా తమ ఆకాంక్షను తెలియజేద్దామని ఆయన చెప్పారు. మార్చ్‌కు అనుమతి ఇచ్చి అరెస్టులు చేయడం దారుణమన్నారు. అరెస్టులను ఆపేందుకే మంత్రులు జానారెడ్డి, సబితా ఇంద్రారెడ్డిలు చొరవ తీసుకోవాలని కోరారు. టీఆర్‌ఎస్‌ శ్రేణులంతా పెద్ద ఎత్తున మార్చ్‌లో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.ఎమ్మెల్యేలమంతా కుటుంబసమేతంగా మార్చ్‌లో పాల్గొంటామని తెలియజేశారు. మెదక్‌ జిల్లా నుంచి సుమారు 200 లారీల్లో హైదరాబాద్‌కు రేపు బయల్దేరుతామని చెప్పారు.