సరూర్నగర్లో వెలుగు చూసిన భారీ మోసం
హైదరాబాద్: నగరంలోని సరూర్నగర్ రెవిన్యూ మండలంలో భారీ మోసం జరిగింది. జన్పల్లిలోని రూ. 200 కోట్లు విలువైన ప్రభుత్వ భూమిని నకిలీ పత్రాలు సృష్టించి ఇద్దరు రెవెన్యూ ఉద్యోగులు అమ్మే ప్రయత్నం చేశారు. ఈ విషయం తెలుసున్న సరూర్నగర్ ఎమ్మార్వో చంద్రరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇద్దరు రెవెన్యూ ఉద్యోగులతో సహా మరో ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు.