సైన్యానికి మరింత బలోపేతం

` 97 ‘తేజస్‌’ యుద్ధవిమానాలు, 156 ప్రచండ్‌ హెలికాప్టర్ల కొనుగోలుకు పచ్చజెండా
` 84 ‘సుఖోయ్‌`30’ యుద్ధవిమానాల అభివృద్ధి ప్రణాళికకూ ప్రాథమిక ఆమోదం
` కేంద్రం కీలక నిర్ణయం
దిల్లీ(జనంసాక్షి): సాయుధ బలగాలను మరింత బలోపేతం చేసే దిశగా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. 97 ‘తేజస్‌’ తేలికపాటి యుద్ధవిమానాలు 156 ప్రచండ్‌ హెలికాప్టర్ల కొనుగోలుకు పచ్చజెండా ఊపింది.దీంతోపాటు వాయుసేనకు చెందిన 84 ‘సుఖోయ్‌`30’ యుద్ధవిమానాల అభివృద్ధి ప్రణాళికకూ ప్రాథమిక ఆమోదం తెలిపింది. రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ నేతృత్వంలో సమావేశమైన డిఫెన్స్‌ అక్వైజిషన్‌ కౌన్సిల్‌ ఈ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపినట్లు సంబంధిత వర్గాలు వెల్లడిరచాయి. ఆయా ఒప్పందాల విలువ దాదాపు రూ.1.6 లక్షల కోట్లుగా ఉంటుందని అంచనా. తేజస్‌ ‘మార్క్‌ 1`ఏ’ యుద్ధ విమానాలను వాయుసేన కోసం, హెలికాప్టర్లను వాయుసేనతోపాటు ఆర్మీ అవసరాలకు కొనుగోలు చేయనున్నట్లు సమాచారం.’తేజస్‌’ తేలికపాటి యుద్ధవిమానాన్ని స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించారు. హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ దీన్ని రూపొందించింది. యాక్టివ్‌ ఎలక్ట్రానిక్‌` స్కాన్డ్‌ అర్రే రాడార్‌, ఎలక్ట్రానిక్‌ వార్‌ఫేర్‌ సూట్‌ తదితర సామర్థ్యాలు దీని సొంతం. ‘ప్రచండ్‌’నూ హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ రూపొందించింది. ఈ హెలికాప్టర్ల మొదటి బ్యాచ్‌ను గత సంవత్సరం వాయుసేన, సైన్యంలోకి చేర్చారు. 21 వేల అడుగుల ఎత్తులోనూ సేవలు అందించగలదు. సియాచిన్‌, లద్ధాఖ్‌, అరుణాచల్‌ ప్రదేశ్‌లోని ఎత్తైన ప్రాంతాల్లోనూ మోహరించేలా దీన్ని రూపొందించారు. ఇదిలా ఉండగా.. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇటీవల కర్ణాటక పర్యటన సందర్భంగా తేలికపాటి యుద్ధ విమానం ‘తేజస్‌’లో విహరించిన విషయం తెలిసిందే.