సోమశేఖర్‌రెడ్డి, సురేశ్‌బాబులకు ఏసీబీ నోటీసులు

హైదరాబాద్‌: గాలి బెయిల్‌ కేసులో విచారణకు హాజరు కావాలని సోమశేఖర్‌రెడ్డి, సురేశ్‌బాబులకు ఏసీబీ నోటీసులు జారీ చేసింది. ఏసీబీ అధికారులు బళ్లారి వెళ్లి వారికి నోటీసులను అందజేశారు. మూడు రోజుల్లో విచారణకు హాజరు కావలసిందిగా ఏసీబీ నోటీసులో పేర్కొంది.