అంకాపూర్ భూతల స్వర్గం
నిజామాబాద్,ఆగష్టు 28 (జనంసాక్షి):
సిఎం కెసిఆర్ సూచనతో నిజామాబాద్ జిల్లా అంకాపూర్ గ్రామాన్ని మెదక్ జిల్లా ఎర్రవల్లి వాసులు శుక్రవారం సందర్శించారు. ఎర్రవల్లి సర్పంచి నేతృత్వంలో 200మంది గ్రామస్థులు, రైతులు సందర్శనకు విచ్చేశారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సూచన మేరకు అంకాపూర్ గ్రామంలో పంటల సాగును పరిశీలిస్తున్నట్లు ఎర్రవల్లి వాసులు తెలిపారు. అంకాపూర్ స్ఫూర్తితో గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని ఈసందర్భంగా వారు తెలిపారు.ఇటీవల సిఎం ఎర్రవల్లిలో గ్రామజ్యోతిలో పాల్గొని అంకాపూర్ గురించి ప్రస్తావించారు. అక్కడికి వెళ్లి అధ్యయనం చేసి రావాలని గ్రామస్థులకు సూచించారు. అక్కడ పంటల విధానం, రోడ్ల నిర్వహణ తదితర అంశలను చెప్పారు. దీనివల్ల ఇక్కడా అలాంటి విధానంతో ముందుకు పోవచ్చన్నారు.