అంగన్వాడీ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శిగా నిర్మల

సూర్యాపేట టౌన్ (జనంసాక్షి): అంగన్వాడీ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శిగా ఇటీవల నియమితులైన విలాసకవి నిర్మల ఆ సంఘ అధ్యక్షురాలు తాటిపాముల నాగలక్ష్మి ఆధ్వర్యంలో మంగళవారం జిల్లా కేంద్రంలోని క్యాంప్ కార్యాలయంలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా నిర్మలను మంత్రి జగదీష్ రెడ్డి సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ సుజాత , ఉపాధ్యక్షురాలు కమల , శాంతరాజ్యం , ఆయోభా , కనకమ్మ , రమణ పాల్గొన్నారు.