అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను పరిశీలిస్తున్న దేవరకొండ మున్సిపల్ చైర్మన్ ఆలంపల్లి నర్సింహ, మాజీ మున్సిపల్ చైర్మన్ వడ్త్య దేవేందర్ నాయక్. కొండమల్లేపల్లి నవంబర్ 4 (జనం సాక్షి) న్యూస్:

దేవరకొండ పట్టణం గాంధీ బజారులో రెండు కోట్ల రూపాయలతో నూతనంగా నిర్మిస్తున్న డ్రైనేజీ మోరి పనులను పరిశీలిస్తున్న దేవరకొండ మున్సిపల్ చైర్మన్ అల్లంపల్లి నర్సిహ్మ,మాజీ మున్సిపల్ చైర్మన్ వడ్త్య దేవేందర్ నాయక్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టణాల పరిశుభ్రతకు టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తూ పట్టణ ప్రగతికి పెద్దపీట వేస్తుందని అన్నారు.  గాంధీ బజారులో ఎన్నో సంవత్సరాలుగా  అస్తవ్యస్తంగా ఉన్న  డ్రైనేజీ వ్యవస్థను ఆధునీకరిస్తూ నూతనంగా  చేపడుతున్న ఈ నిర్మాణంతో గాంధీ బజారు నూతన రూపు రేఖలు సంతరించుకుంటాయని ఆశ భావం వ్యక్తం చేశారు. ఎన్నో ఏళ్లుగా గాంధీ బజారులో అభివృద్ధికి నోచుకోని అభివృద్ధి  పనులను ఇప్పుడు ప్రారంభించడం ఎంతో సంతోషాన్నిస్తుందని గాంధీ బజార్ వార్డు ప్రజలు సంతోషాన్ని, తమ హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు  నిర్మాణ పనులను మంచి నాణ్యతతో శరవేగంగా జరుగుతున్నాయని ప్రజల ఆశాభావం వ్యక్తం చేశారు