అంబేద్కర్ విశ్వ మానవుడు

అంబేద్కర్ విషయం మానవుడని భారతదేశానికే దిక్సూచిగా రాజ్యాంగాన్ని రచించిన మేధావి అని పలువురు డిఎస్పీ నాయకులు కోనియాడారు డిఎస్పీ దళిత శక్తి ప్రోగ్రాం ఆధ్వర్యంలో వంగూరు మండల కేంద్రంలో ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు
డాక్టర్ విశారదన్ మహారాజ్ ఆదేశాల మేరకు భారత రాజ్యాంగం దినోత్సవాన్ని పురస్కరించుకొని మండల కేంద్రంలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలను డిఎస్పీ ఆధ్వర్యంలో ఘనంగా  నిర్వహించారు.డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి రాజ్యాంగ పీఠికను వివరిస్తూ ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో నాగర్ కర్నూల్ జిల్లా ఉపాధ్యక్షుడు కొప్పు సురేష్ మహరాజ్, జిల్లా ప్రధాన కార్యదర్శి  నాగార్జున మహారాజ్, ముఖ్య అతిథులుగా సర్పంచి ఎల్ల గౌడ్ గారు ఎంపీటీసీ రమేష్ , ఏపీవో లక్ష్మణ్, ఉమాపూర్ కృష్ణయ్య, మల్లేష్, సాయిల్ ,ఎస్.కె కృష్ణ, అంబేద్కర్ యూత్ వైస్ ప్రెసిడెంట్ రమేష్, ఆర్ఎంపి డాక్టర్స్ మహేష్ మహారాజ్, గణేష్ మహారాజు బహుజన సంఘాల నాయకులు తదితర పెద్దలు పాల్గొన్నారు