అక్బరుద్దీన్‌పై కేసు నమోదు

న్యూఢిల్లీ: మజ్లీన్‌ పార్టీ శాసనసభ్యుడు అక్బరుద్దీన్‌ ఒవైసీపై దేవరాజధాని పార్లమెంటరీ స్ట్రీట్‌ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు నమోయింది. ఇటీవల నిర్మల్‌లో జరిగిన సభలో అక్బర్‌ చేసిన వ్యాఖ్యలు లౌకిక, ప్రజాస్వామ్య, రాజ్యాంగ విలువలపై దాడిలావుందంటూ సామాజిక కార్యకర్త షబ్మమ్‌ హష్మీ ఆయన పై ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదు మేరకు భారతీయ శిక్షా స్రృతి 153ఏ సెక్షన్‌ కింద పోలీసులు అక్బర్‌పై కేసును నమోదుచేశారు.