అచ్చంపేట పట్టణం లో మాజీ ప్రధాని స్వర్గీయ శ్రీమతి ఇందిరా గాంధీ జయంతి వేడుకలు

అచ్చంపేట ఆర్సి, 19 నవంబర్ ,2022, (జనం సాక్షి న్యూస్ ) : అచ్చంపేట మండల పార్టీ బ్లాక్ కాంగ్రెస్ ఆధ్వర్యం లో కాంగ్రెస్ పార్టీ నాయకులు మండల ప్రజా పరిషత్తు కార్యాలయంలో ని మాజీ ప్రధాని స్వర్గీయ శ్రీమతి ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి నివాళ్లు అర్పించారు. వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ ..ఇందిరాగాంధీ ప్రపంచంలోనే శక్తివంతమైన ఉక్కు మహిళగా, అత్యంత శక్తివంతమైన రాజకీయ నాయకురాలిగా పనిచేశారని కొనియాడారు. భారతదేశానికి సుస్థిరత పాలన అందించి, బడుగు బలహీన వర్గాల పాలిట దైవంగా మారి ఆదర్శవంతమైన పరిపాలన అందించిన మహా నాయకురాలు అని తెలిపారు. కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గోపాల్ రెడ్డి , మండల పార్టీ అధ్యక్షుడు నర్సయ్య యాదవ్, మున్సిపాలిటీ కౌన్సిలర్ గౌరీ శంకర్,
అమ్రాబాద్ ఎంపీపీ శ్రీనివాసులు, సీనియర్ నాయకులు కపిలవాయి శేఖర్, మహబూబ్ అలీ , రాఘవులు , ముత్యాలు, మల్లికార్జున్, రాజగోపాల్ , యూత్ కాంగ్రెస్ నాయకులు అధ్యక్షులు అజయ్, అచ్చం పేట నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఖాదర్ , మహేష్, కృష్ణ‌ నాయక్ , జి.అంజి , మహేష్ యాదవ్ , మౌలానా , శ్రీకాంత్ , తదితరులు పాల్గొన్నారు