అత్యాచార బాధితురాలికి అబార్షన్
అనుమతించిన మద్రాస్ హైకోర్టు
చెన్నై,మే5(జనం సాక్షి ): 14 ఏళ్ల ఓ అత్యాచార బాధితురాలు అబార్షన్ చేయించుకునేందుకు మద్రాసు హైకోర్టు అనుమతి ఇచ్చింది. ఐదు నెలల క్రితం ఆమెకు తెలిసిన ఓ వ్యక్తి చేతుల్లోనే మైనర్ బాలిక అత్యాచారానికి గురైంది. చెంగపట్టులోని బాల సంరక్షణ కమిటీ దాఖలు చేసిన పిటిషన్ మేరకు జస్టిస్ టి. రాజా ఈ తీర్పు వెలువరించారు. చెంగల్పెట్ మెడికల్ కాలేజ్ డీన్తో పాటు ఆస్పత్రి సిబ్బంది బాధితురాలికి గర్భస్రావం చేసి పిండాన్ని భద్రపర్చాలని ఆయన ఆదేశించారు. ఐదు నెలల క్రితం తమ కుమార్తెపై ఓ వ్యక్తి అత్యాచారం చేశాడంటూ బాలిక తల్లిదండ్రులు కాంచీపురం కలెక్టర్ను ఆశ్రయించారు. దీంతో ఆమెను చెన్నైలోని ఓ ¬మ్కి తరలించారు. బాలిక గర్భం కొనసాగించే అవకాశాలపై గతనెల 12న ¬మ్ యాజమాన్యం చెంగల్పట్టు మెడికల్ కాలేజీకి లేఖ రాసింది. అయితే బాలిక ప్రాణాలకే ప్రమాదం ఉందని తేలడంతో.. అబార్షన్ చేయించుకోవాలంటూ మైనర్ బాలిక, ఆమె తల్లిని అధికారులు ఒప్పించారు. వెంటనే అబార్షన్కు అనుమతి ఇవ్వాలంటూ ¬ం యాజమాన్యం హైకోర్టును ఆశ్రయించింది.