అదిగో పెద్ద పులి

పలిమెల మండలంలోని ముకునూరు గ్రామం అడవిలో పెద్ద పులి సంచరించినట్లు చూసిన స్థానికులు తెలిపారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మహముత్తారం మండలం కనుకునూరు పలిమెల మండలం ముకునూరు గ్రామాల మద్యలో పెద్దపులి సంచరించిందని స్థానికులు తెలిపారు. అదే గ్రామానికి చెందిన పూనెం రాంబాబుకు చెందిన దుక్కిటెద్దుపై దారుణంగా దాడి చేసి చంపినట్లు స్థానికులు తెలిపారు. మండల ప్రజలు ఆవులను, మేకలను, గొర్లను మేపడానికి అడవులకు వెళ్లరాదని, ప్రజలు కూడా ఇతరత్ర అవసరాలకు అడవిలోకి వెళ్లరాదని అటవీ అధికారులు హెచ్చరించారు. పులి వెళ్లిపోయిందని సమాచారం ఇచ్చేవరకు ప్రజలు ఊర్లోనె ఉండాలని తెలిపారు.