అదుపుతప్పి ట్రాక్టర్ బోల్తా: ఇద్దరు మృతి
కమాన్పూర్, జనంసాక్షి: కరీంనగర్ జిల్లా కమాన్పూర్ మండలంలోని పేరేపల్లినుంచి రొంపికుంట గ్రామానికి వెళ్తున్న ట్రాక్టర్ బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతిచెందగా , ముగ్గురికి తీవ్రగాయాలవడంతో వీరి పరిస్థితి విషమంగా ఉంది. పేరేపల్లి గ్రామానికి చెందిన గుర్రాల సంజీవ్(16), కలవేన శ్రీనివాస్(12), సిత్ధం మారుతి(10)లు ట్రాక్టర్లో వెళ్తున్నారు. ట్రాక్టర్ బోల్తా పడటంతో గుర్రాల సంజీవ్ అక్కడిక్కడే మృతిచెందాడు. కలవేన రమేశ్కు ఎడమకాల విరిగింది. శ్రీనివాస్, మారుతిల పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను స్థానాకులు పెద్దపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.