అద్వానీని కలిసినప్పుడు మతతత్వం గుర్తు రాలేదా: నాగం

హైదరాబాద్‌ : లూధియానాలో భాజపా అగ్రనేత ఎల్‌కే అద్వానీని కలిసినప్పుడు కేసీఆర్‌కు మతతత్వం గుర్తు రాలేదా అని తెలంగాణ నగారా సమితి అధ్యక్షుడు నాగం జనార్ధన్‌రెడ్డి ప్రశ్నించారు. భాజపాను గెలిపిస్తేనే తెలంగాణ సాధ్యమని నాగం జనార్దన్‌రెడ్డి మరోసారి స్పష్టం చేశారు.