అనంత ఆస్పత్రిని అభివృద్ది చేయండి

అనంతపురం,అక్టోబర్‌ 4 (జనంసాక్షి):  అనంతపురం ఆస్పత్రిలో సదుపాయాలను మెరుగు పర్చాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వి.రాంభూపాల్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఇటీవలి ఘటనల నేపథ్యంలో ప్రభుత్వ సర్వజనాసుపత్రిలో 500 పడకల ఆసుపత్రిగా తీర్చిదిద్దేందుకు నిధులు విడుదల చేయాలని అన్నారు. బుధవారం నాడిక్కడ  ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ సర్వజనాసుపత్రిలో  రోగులు ఇబ్బందులను పరిష్కరించాలని  చెప్పారు. తంలో ప్రభుత్వ ఆసుపత్రిని పరిశీలించి 350 పడకల ఆసుపత్రి నుంచి 500 పడకల ఆసుపత్రిగా పెంచాలని, ఆయా శాఖలకు ఉద్యోగులను నియమిస్తామని ప్రకటించిందన్నారు.ఆయా శాఖల ఆధారంగా ఎంత వేతనాలు ఇవ్వాలో కూడా నిర్ణయిస్తూ జీవో 124ను విడుదల చేశారన్నారు.