అనారోగ్యంతో హోంగార్డు మృతి

భీమదేవరపల్లి మండలం అక్టోబర్ (23)
జనంసాక్షి న్యూస్
అనారోగ్యంతో చికిత్స పొందుతూ గబ్బెట రమేష్ అనే హోంగార్డు శనివారం అర్ధరాత్రి మృతి చెందాడు భీమదేవరపల్లి మండలం ముత్తారం గ్రామానికి చెందిన రమేష్ హన్మకొండ పోలీసు హెడ్ క్వార్టర్స్ లో విధులు నిర్వహిస్తున్నాడు. శనివారం నాడు అస్వస్థతకు గురైన అతన్ని కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆసుపత్రిలో మృతి చెందగా మృతదేహాన్ని స్వగ్రామం ముత్తారం అంత్యక్రియలు నిర్వహించారు. అంత్యక్రియలనిమిత్తం ఎల్కతుర్తి సీఐ శ్రీనివాస్,  ముల్కనూర్ ఎస్సై ప్రవీణ్ కుమార్ రూ. 5000 నగదు హోంగార్డు కుటుంబ సభ్యులకు అందించారు
మృతునికి భార్య స్వరూప  ఇద్దరు పిల్లలు ఉన్నారు