అన్నం పరబ్రహ్మ స్వరూపం.

అన్ని దానాల కన్నా అన్నదానం గొప్పది.
మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వర్త్య విఠల్ నాయక్.
తాండూరు అక్టోబర్ 28(జనంసాక్షి)అన్ని దానాల కన్నా అన్నదానం గొప్పదనిమార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వర్త్య విఠల్ నాయక్ పేర్కొన్నారు.శనివారం పౌర్ణమి సందర్భంగా ఘానగాపూర్ లో వెలిసిన శ్రీ దత్తాత్రేయ స్వామి సన్నిధికి చేరుకుని ఆలయంలో కొలువు దదీరిన
దత్తాత్రేయున్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఆలయ ప్రధానార్చకులు వేదమంత్రోచ్ఛారణలతో ఆశీర్వదించి మరేన్నో ఉత్తమ పదవులు చేపట్టాలని మనసారా ఆశీర్వదించి తీర్ధ ప్రసాదాలను అందజేసి ఘనంగా సన్మానించారు. పౌర్ణమి పురష్కరించు కొని ఆలయ ప్రాంగణంలో భక్తులకు అన్నదానం చేపట్టారు.ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వర్త్య విఠల్ నాయక్ మాట్లాడుతూ పౌర్ణమి పురష్కరించుకొని అన్నదాన కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. అన్ని దానాల కన్నా అన్నదానం గొప్పదన్నారు. అన్నం పరబ్రహ్మ స్వరూపమన్నారు.ప్రతి ఒక్కరు భక్తి భావాన్ని అలవర్చుకోవాలని సూచించారు. ప్రతి నెల పౌర్ణమి రోజు శ్రీ దత్తాత్రేయ స్వామిని దర్శించుకో వడం జరుగుతుందని వెల్లడించారు.
దత్తాత్రేయ స్వామి కృపతోనే దినదిన అబివృద్ది
చేందుతున్నట్లు వేల్లడించారు.ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఆలయ పూజారులు భక్తులు తదితరులు ఉన్నారు.