అన్నా బృందం దీక్షకు షరతులతో కూడిన అనుమతి

ఢిల్లీ : జంతర్‌మంతర్‌ వద్ద నిరవధిక నిరశన దీక్ష చేపట్టాడానికి ఎట్టాకేలకు అన్నాబృందానికి ఢిల్లీ పోలీసులు అనుమతి లభించింది. రెండు రోజుల క్రితం అనుమతి నిరకరించిన పోలీసులు జూలై 25 నుంచి ఆగస్టు 8మధ్య అనుమతిస్తూ ఈ రోజు అంగీకారం తెలియజేశారు. రోజుకు వెయ్యి మంది ఆందోళనకారులు, 5వేల మంది ప్రజలకన్నా ఎక్కువ మంది ఆ ప్రదేశానికి రాకూడదని, బృంద సభ్యుడు నీరజ్‌ పాండే ఆ మేరకు హమీ ఇచ్చారని, అందుకే అనుమతిస్తున్నమని  పోలిసులు తెలిపారు. అవినితిని అరికట్టడంలో, బలమైన లోక్‌నాల్‌ తేవడంలో విఫలంమైన యూపీఏ ప్రభుత్వనికి వ్యతిరేకంగా అన్నా బృందం జూలై 25నుంచి నిరవధిక నిరశన దీక్ష చేపట్టనున్నట్లు ప్రకటించారు.