అన్నీ ఉన్న అల్లుడి నోట్లో శని ఉన్నట్లు గా తాండూర్ మున్సిపాలిటీ..

చైర్ పర్సన్ కుర్చీ దిగే ప్రసక్తే లేదు.
అధిష్టానం మాట శిరసావహిస్తాం…
ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి పై బురద జల్లే ప్రయత్నం మానుకోవాలి.
మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న కౌన్సిలర్లు.
తాండూరు జులై 30(జనంసాక్షి) తెలంగాణ ప్రభుత్వం తాండూర్ మున్సిపాలిటీకి అనేక నిధులు మంజూరు చేసినప్పటికీ అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని ఉన్నట్లు గా తాండూర్ మున్సిపాలిటీ కొనసాగుతుందని మున్సిపల్ చైర్ పర్సన్ తాటికొండ స్వప్న పరిమళ్
 పేర్కొన్నారు.వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణం ఎమ్మెల్సీపట్నం మహేందర్ రెడ్డి నివాసంలో శనివారం విలేకరుల సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న మరియు కౌన్సిలర్లు శోభారాణి నీరజ బాల్ రెడ్డి లు మాట్లాడుతూ క్రమశిక్షణ గురించిమీరు మాట్లాడడం విడ్డూరమన్నారు. ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి పై మాట్లాడే అర్వతలేదని మండ్డిపడ్డారు. కావాలని బురదజల్లె ప్రయత్నం మనుకోవాలని పేర్కొన్నారు.ఓ వర్గం నాయకులు అభివృద్ధిని అడ్డుకుంటున్నారని విమర్శించారు.ముందుగా క్రమశిక్షణ మీరు నేర్చుకోవాలని ఎద్ధేవచేశారు .రెచ్ఛగోట్టే మాటలు మానుకోవాలని సూచించారు.అసలైన టిఆర్ఎస్ పార్టీ నాయకులం మేము…కాంగ్రెస్ నుంచి వచ్చి ఇక్కడ పెత్తనం చేయడం విడ్డూరంగా ఉందన్నారు.అన్ని ఉన్నాఅల్లుని నోట్లో శని ఉన్నట్లుగా తాండూరు మున్సిపల్ ఉందన్నారు.మాకు పోలీస్ ప్రోటక్షన్ కల్పించాలని చైర్ పర్సన్ స్వప్న డిఎస్పీ ని కోరారు. గతరెండు సంవత్సరాలుగా తాండూరు మున్సిపాలిటీ కి కమిషనర్ లేకపోవడం గమనార్హమన్నారు.చైర్ పర్సన్ విషయం అదిష్టానం చూస్తుందన్నారు. తాండూరు. అభివృద్ధి ని అడ్డుపడుతున్నది మీరుకాదా అని ప్రశ్నించారు. అన్నవిషయాలను కాలమే నిర్ణహిస్తూందని అన్నారు.అదిష్టానం మేరకు కట్టుబడి ఉన్నాం.రెండు సంవత్సరాలు కరోణతో కాలం వృదాపోయింది.మహిళా కౌన్సిలర్ లని చూడకుండా లేనిపోని ఆరోపణలు అరోపించడం విడ్డూరం.చైర్ పర్సగా దిగేప్రశక్తేలేదని తెల్చిచేప్పారు..ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ లు నిరజబాల్ రెడ్డి, శోభారాణి ,రత్నమాళ ,సల్మా పాథీమా ,అబ్దుల్ రజాక్ ,బోయరవిరాజు ,మణపూరం రాము ,వెంకన్నగౌడ్,ప్రవీణ్  గౌడ్ ,నాయకులు బాల్ రెడ్డి ,నర్సింహులు తదితరులు ఉన్నారు.