అన్నీ రంగాల్లో ప్రభుత్వం విఫలం

చంద్రబాబునాయుడు
హైదరాబాద్‌ : అన్నీ రంగాల్లోనూ రాష్ట్ర ప్రభుత్వం విఫలమయిందని తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబునాయుడు విమర్శించాడు. గ్రామీణప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా అంతరాయంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆయన విమర్శించారు. తగినంత విద్యుత్‌ లేకపోవడంతో పారిశ్రిమిక రంగంలో ఉత్పాదన తగ్గిందన్నారు. జలయజ్ఞానికి వేలకోట్ల రూపాయలు ఖర్చుపెట్టినా ఎకరాకు కూడా నీళ్లు ఇవ్వలేకపోయారని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో తీవ్రమైన కరవు పరిస్థితులు ఏర్పడినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వంలో ఎలాంటి కదలిక రాకపోవడంపై బాబు అగ్రహం వ్యక్తం చేశారు. ప్రత్యేక ఆర్థికమండళ్ల పేరుతో 2 లక్షల ఎకరాలను లాక్కున్నారని ఆయన ఆరోపించారు. ప్రభుత్వ వసతి గృహాల్లో వాస్తవ పరిస్థితులు తెలుసుకునేందుకు వసతిగృహాల్లో తెలుగుదేశం నేతలు నిద్రచేయాలని ఆయన తెలుగుదేశం శ్రేణులకు పిలుపునిచ్చారు.