అప్పు తీర్చలేక తల్లీ కొడుకు ఆత్మహత్య

పంజాబ్‌ : చేసిన అప్పు తీర్చలేక తల్లీ కొడుకు ఆత్మహత్య చేసుకున్నారు. పంజాబ్‌లోని జోధ్‌పూర్‌ గ్రామానికి చెందిన బల్జీత్ సింగ్‌ తన తల్లికి చెందిన రెండెకరాల పొలం తాకట్టు పెట్టి రూ. 10 లక్షలు అప్పు తీసుకున్నారు. సకాలంలో అప్పు తీర్చలేకపోవడంతో అప్పు ఇచ్చిన వ్యక్తి కోర్టుకు వెళ్లాడు. కోర్టు తీర్పు వ్యతిరేకంగా రావడం, చేసిన అప్పు కింద పొలం పోవడంతో బల్జీత్ సింగ్‌ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయం తెలిసిన అతని తల్లి కూడా ఆత్మహత్య చేసుకుంది.