అభివృద్ధికి ఆత్మగౌరవానికి మునుగోడు ప్రజలు పట్టం కట్టారు కొండమల్లేపల్లి జడ్పిటిసి సలహాదారు పసునూరు

యుగేందర్ రెడ్డి కొండమల్లేపల్లి నవంబర్ 7 జనం సాక్షి న్యూస్ : మునుగోడు ఉప ఎన్నికలలో భారీ మెజార్టీతో విజయం సాధించిన టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి కి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా జడ్పిటిసి సలహాదారు పసునూరు యుగేందర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ ఆస్థిరత సృష్టించాలని కుట్రలు పన్నుతున్న బిజెపి పార్టీకి మునుగోడు ఉప ఎన్నిక ఫలితం చెంపపెట్టు లాంటిది తెలంగాణలో బిజెపి పార్టీకి స్థానం లేదని బిజెపి పార్టీని నేతలు నోరు అదుపులోని పెట్టుకుని మాట్లాడాలని బిజెపి నాయకులు కేసీఆర్ ని విమర్శిస్తే ఊరుకోమని తెలిపారు రాష్ట్ర అభివృద్ధిని చూసి ప్రజలు నమ్మారని మునుగోడు ఉప ఎన్నికలలో టిఆర్ఎస్ పార్టీకి విజయాన్ని అందించిన ప్రజలకు పార్టీ కార్యకర్తలకు అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు తెలంగాణ సమాజం టిఆర్ఎస్ పార్టీ వెంటే ఉన్నదని మునుగోడు ఉప ఎన్నికల ఫలితాలతో మరోసారి రుజువైందని తెలిపారు తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి బిజెపి కుట్రల మధ్య జరుగుతున్న పోరాటంలో టిఆర్ఎస్ పార్టీ పక్షాన నిలిచిన మునుగోడు ప్రజలు చైతన్యానికి మారుపేరుగా నిలిచారని ప్రశంసించారు మునుగోడు లో టిఆర్ఎస్ పార్టీకి అఖండ విజయాన్ని అందించిన టిఆర్ఎస్ పార్టీ శ్రేణులు కార్యకర్త అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు నల్లగొండ జిల్లాలో ఇప్పటికీ హుజూర్ నగర్, నాగార్జునసాగర్ మరియు మునుగోడు నియోజకవర్గాలలో హ్యాట్రిక్ విజయాన్ని సాధించిందని తెలిపారు ఎన్నిక ఏదైనా ప్రజలు కేసీఆర్ వెంటే ఉంటారని తెలిపారు మునుగోడులో భారీ మెజార్టీతో విజయం సాధించిన కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారికి శుభాకాంక్షలు అభినందలు తెలియజేశారు