అభివృద్ధిని అడ్డుకోవడం కాంగ్రెస్ నైజం: దత్తాత్రేయ
ఢిల్లీ, ఆగస్టు13: అభివృద్ధిని అడ్డుకోవడం కాంగ్రెస్ నైజమని కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ విమర్శించారు. మంత్రులపై అవినీతి ఆరోపణలను కాంగ్రెస్ నిరూపించలేకపోయిందని ఎద్దేవా చేశారు. పార్లమెంట్ సమావేశాలను అడ్డుకోవడం కాంగ్రెస్ దివాళుకోరుతనానికి నిదర్శనమని దత్తాత్రేయ వ్యాఖ్యానించారు.