అభివృద్ధిని మరిచి శ్రీధర్ బాబు పై విమర్శలా…

బ్లాక్ కాంగ్రెస్ అద్యక్షులు కోట రాజబాబు
మహదేవపూర్ సెప్టెంబర్ 19 (జనంసాక్షి)
మంథని నియోజకవర్గంలో అన్ని వర్గాలకు సమ న్యాయం చేసినందుకు దుద్దిళ్ల శ్రీధర్ బాబు ను నాలుగు సార్లు ఎమ్మెల్యే గా  గెలిపించారని మహాదేవపూర్ బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కోట రాజ బాబు అన్నారు సోమవారంనాడు మహాదేవపూర్ మండల కేంద్రంలో విలేఖరుల  సమావేశంలో ఆయన మాట్లాడుతూ మంథని నియోజకవర్గంలో ,విద్యా  .వైద్యం రంగాలలో నియోజకవర్గంలో ముందు నడిపించారని చిన్న కాళేశ్వరం ప్రాజెక్టును శంకుస్థాపన చేసి ఆ ప్రాజెక్టు ద్వారా 5మండల రైతులకు సాగు నీరు అందించే కార్యక్రమంమొదలు పెట్టారని అది పర్యవరణ అనుమతుల వల్ల. మధ్యలోనే నిలిచిపోగా ఎమ్మెల్యే శ్రీధర్ బాబు కేంద్రం నుండి పర్యావరణఅనుమతులు మంజూరు చేయించిన ఘనత ఎమ్మెల్యే శ్రీధర్ బాబు దే అని ఆయన అన్నారు. ఇప్పుడున్న టిఆర్ ఎస్ ప్రభుత్వం చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు పై చిన్న చూపు చూస్తున్న ఏ ఒక్కనాడు దాని ప్రస్తావన ఎందుకు తీయలేదని పెద్దపల్లి జడ్పీ ఛైర్మన్ పుట్టమదుపై తీవ్రస్థాయిలో విమర్శించారు. పెద్ద కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల నియోజకవర్గంలో ఏ ఒక్క ఏకరానికైనా నీళ్ళు అందించినవా అంటూ ప్రశ్నించారు. చిన్న కాళేశ్వరం పూర్తి అయితే ఆ ఘనత శ్రీధర్ బాబు దక్కుతాదనే ఈర్ష తో శ్రీధర్ బాబు పై విమర్శలు చేయడం చిగ్గు చేటని ఆయన దుయ్యబట్టారు. ఇకనైనా కుల రాజకీయాలు, హత్యా రాజకీయాలను మాని ఈ ప్రాంత అభివృద్ధి పై దృష్టి సారించాలని హితవుపలికారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కోట రాజబాబు తో పాటు మాజీ సింగిల్ విండో చైర్మన్ కాంగ్రెసు సీనియర్ నాయకుడు వామన రావు, నాయకులు గుడాల శ్రీనివాస్,మెషినేని రవిచందర్, మైనార్టీ సెల్ అధ్యక్షుడు అస్రా ర్ ,కోట సమ్మయ్య,కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.